ఎచ్చెర్ల మనదే..!
జిల్లాల పునర్విభజన కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాల నైసర్గిక స్వరూపాలు, విలీన మండలాలు, మారిన రెవెన్యూ డివిజన్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వాటిని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. పార్లమెంటు నియోజకవర్గాల్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు
దూరమైన రాజాం, పాలకొండ
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్టుడే, రాజాం
జిల్లాల పునర్విభజన కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాల నైసర్గిక స్వరూపాలు, విలీన మండలాలు, మారిన రెవెన్యూ డివిజన్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వాటిని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. పార్లమెంటు నియోజకవర్గాల్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఆమేరకు జిల్లాల పునర్విభజనపై కసరత్తు ఎట్టకేలకు పూర్తయింది. గెజిట్ నోటిఫికేషన్ రావడమే తరువాయి. ఇప్పటివరకూ 38 మండలాలతో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇకపై 30 మండలాలతో కొనసాగనుంది.
రెండే రెవెన్యూ డివిజన్లు
ఇప్పటివరకూ జిల్లాలో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లు ఉండేవి. ఇకపై శ్రీకాకుళం, టెక్కలి మాత్రమే ఉంటాయి. పాలకొండ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు కానున్న ‘మన్యం’ జిల్లాలో కలుస్తున్న నేపథ్యంలో ఆ రెవెన్యూ డివిజన్లో ఇదివరకున్న ఇతర మండలాలను శ్రీకాకుళం, టెక్కలిలలో కలిపేశారు. రెవెన్యూ డివిజన్లో ఇప్పటికే ఉన్న 13 మండలాలకు అదనంగా కొత్తూరు, హిరమండలం, సారవకోట వచ్చి చేరడంతో సంఖ్య 16కు చేరింది. టెక్కలి రెవెన్యూ డివిజన్లో పాతపట్నం, మెళియాపుట్టి చేర్చడంతో దాని మండలాలు 14కు చేరాయి. శ్రీకాకుళం(16), టెక్కలి(14) రెవెన్యూ డివిజన్లతో కొత్త సిక్కోలు రూపు దిద్దుకోనుంది.
ప్రత్యేక మినహాయింపుతో..
జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి అందరి చూపు ఎచ్చెర్ల నియోజకవర్గంపైనే ఉంది. జిల్లాలోనే అతిభారీ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నది ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే. ఎచ్చెర్లకు శ్రీకాకుళంతో చాలా దగ్గరి అనుబంధం ఉందని, జిల్లాలు పునర్విభజన చేసినా ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళంతో కలిపి ఉంచాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ మేరకు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎచ్చెర్ల నియోజకవర్గం కూడా సిక్కోలులో భాగంగానే ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చి సిక్కోలులో భాగంగానే ఉంచడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో రాజాం నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో రాజాం, పాలకొండ ఉన్నాయి. ఇప్పుడు రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు మండలాలూ విజయనగరం జిల్లాలో కలుస్తున్నాయి. పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాలు కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లాలో భాగం కానున్నాయి. అంటే మొత్తం ఎనిమిది మండలాల ప్రజలు సిక్కోలు నుంచి విడిపోయి రెండు ఇతర జిల్లాల్లో కలుస్తున్నారు.
భౌగోళిక స్వరూపం దృష్ట్యా
రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భౌగోళిక స్వరూపం రీత్యా అరకుకు మాత్రమే రెండు జిల్లాల అవకాశం దక్కింది. అరకు, పాడేరు, పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ, రంపచోడవరం నియోజకవర్గాలతో ప్రస్తుతం దేశంలోనే అత్యధిక భౌగోళిక విస్తీర్ణం ఉన్న నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. అరకు పార్లమెంటుని అరకు, మన్యం జిల్లాలుగా విభజించారు. పార్వతీపురం రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలు, పాలకొండలో రెవెన్యూ డివిజన్లో మిగిలిన 6 మండలాలతో కలిపి మన్యం జిల్లా ఏర్పాటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..