మూలపడిన ప్రయోగం!
జిల్లాలో కంచిలి, సీతంపేట, పలాస, డోలపేట, పోలవరం, కోటబొమ్మాళి, జి.సిగడాం, మడ్డువలస, నందిగాం, బొమ్మిక, దుప్పలవలస, కొల్లివలస, ఇప్పిలి, మల్లి తదితర ప్రభుత్వ పాఠశాలలతో పాటు శ్రీకాకుళం...
శిక్షకుల కొరతే కారణం
న్యూస్టుడే, సోంపేట
కంచిలి జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో 2019లో అన్ని సదుపాయాలతో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఐదు విభాగాలకు సంబంధించిన అంశాలలో శిక్షణ పొందేందుకు వీలుగా రూ. 20 లక్షలు వెచ్చించి పరికరాలు కొనుగోలు చేశారు. శిక్షకుడిని మాత్రం నియమించలేదు. దీంతో ఉపాధ్యాయులు ఖాళీ సమయాల్లో విద్యార్థులకు కొన్ని అంశాలపై తర్ఫీదు ఇవ్వడం తప్పిస్తే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేక పోతున్నారు. పలు పాఠశాలల్లో ఈ మాత్రం కూడా లేక విలువైన పరికరాలు మూలన పడేశారు. రూ.5.60 కోట్ల విలువైన పరికరాలు పనికి రాకుండా పోతున్నాయి.
జిల్లాలో కంచిలి, సీతంపేట, పలాస, డోలపేట, పోలవరం, కోటబొమ్మాళి, జి.సిగడాం, మడ్డువలస, నందిగాం, బొమ్మిక, దుప్పలవలస, కొల్లివలస, ఇప్పిలి, మల్లి తదితర ప్రభుత్వ పాఠశాలలతో పాటు శ్రీకాకుళం ఆర్.కె.స్కూలు, పలాస-కాశీబుగ్గ శ్రీగురుకుల విద్యాలయం, పొలాకి విశ్వశాంతి హైస్కూలు, విజ్ఞాన్ ఇంగ్లీషు మీడియం పాఠశాల తదితర ప్రైవేటు హైస్కూళ్లలోనూ అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద 28 చోట్ల ఇవి ఏర్పాటయ్యాయి. 2017 నుంచి 2021 వరకు వీటిని మంజూరు చేసి అనుగుణంగా ఒక్కో చోట రూ.20 లక్షల విలువైన పరికరాలు సమకూర్చారు. ప్రతి స్కూలులో దీనికి గాను అన్ని వసతులు, ఫర్నీచర్తో ప్రత్యేక గది కేటాయించారు.
ల్యాబ్లు మంజూరైన స్కూళ్ల వివరాలు
జడ్పీ ఉన్నతపాఠశాలలు 8
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు: 1
మోడల్ విద్యాలయాలు: 3
సాంఘిక సంక్షేమ గురుకులాలు 8
గిరిజన గురుకులాలు 4
ప్రైవేటు స్కూళ్లు: 4
ఐదు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు అవకాశం
టాయ్స్, ట్రేడిషనల్టూల్స్, అగ్రిఅండ్పుడ్, రోబోటిక్స్, సాఫ్ట్వేర్ రంగాలపరంగా ఐదు విభాగాల్లో విద్యార్ధులకు తర్ఫీదు ఇచ్చేందుకు వీలుగా వివిధ రకాల పరికరాలు ప్రయోగశాలలకు అందజేశారు. గేమ్స్, ఇతర బొమ్మలతయారీ, ఇంజనీరింగ్ ప్రాజెక్టుల తయారీ, వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన ప్రాజెక్టులు, రోబోటిక్, సెన్సార్, ఎలక్ట్రానిక్స్, త్రీడి ప్రింటింగ్, ఆటోమిషన్, వెబ్సెట్, ప్రోగ్రామింగ్, ఆన్లైన్ సర్వీసెస్, తదితర అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది. శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్ల నియామకం లేకపోవడంతో ‘ప్రయోగం’ మూలన పడింది.
ఇన్స్ట్రక్టర్ల ఏర్పాటుకు చర్యలు
జిల్లా విద్యాశాఖాధికారి, ఇతర అధికారులతో మాట్లాడి అటల్ టింకరింగ్ ల్యాబ్లు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. పరికరాలు విద్యార్థులకు వినియోగపడేలా ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాల్సి ఉంది. జిల్లా అధికారులతో చర్చించిన తరువాత ఇవి పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చర్యలు చేపడతాం. జిల్లాపరిషత్తు పరంగా అందించాల్సిన సాయం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం.
-పిరియా విజయసాయిరాజ్, జడ్పీ అధ్యక్షురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.