మొక్క..లేదిక్కడ!
పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామ రహదారి ఇది. ‘జగనన్న పచ్చతోరణం’ కింద ఈ రహదారి పొడవునా 400 మొక్కలను అధికారులు నాటారు. చిత్రంలో కనీసం ఓ ఇరవై మొక్కలైనా కన్పించాలి.
పాలకొండ, న్యూస్టుడే
పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామ రహదారి ఇది. ‘జగనన్న పచ్చతోరణం’ కింద ఈ రహదారి పొడవునా 400 మొక్కలను అధికారులు నాటారు. చిత్రంలో కనీసం ఓ ఇరవై మొక్కలైనా కన్పించాలి. కనుచూపు మేరలో మరి మూడు నాలుగు మోడులు తప్ప మరేమీ కన్పించడం లేదు. నిర్వహణ సక్రమంగా లేక 150కి పైగా మొక్కలు, వేసిన రక్షణ కంచెలూ ప్రస్తుతం కనిపించడం లేదు. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి.
పర్యావరణ పరిరక్షణతో పాటు వేతనదారులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో తొమ్మిది వందల గ్రామ పంచాయతీల పరిధిలో 954 కిలోమీటర్ల మేర గతేడాది జులైలో అధికారులు 3.81 లక్షలు మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించి ఒక్కో మొక్కకు రూ.350 వరకు వ్యయం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు తెప్పించడంతో పాటు మొక్క నాటడం, కంచె ఏర్పాటుతో పాటు నిర్వహణకు ఈ మొత్తాన్ని వెచ్చించారు.
కనుమరుగవుతున్నాయ్..
నీరందించకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా చాలా వరకు మొక్కలు చనిపోయాయి. ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం 3.14 లక్షల మొక్కలు ఉన్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో చాలా వే కన్పిస్తున్నాయి. లబ్ధిదారుల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతోపాటు రహదారి వెంబడి మొక్కలు నాటడంతో నీరు మోసుకువెళ్లేందుకు దూరం కావడంతో లబ్ధిదారులు చాలాచోట్ల నిర్వహణను గాలికొదిలేస్తున్నారు.
దృష్టిసారించని ప్రజాప్రతినిధులు
ఈ సారి జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచులు పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 85 శాతం మొక్కలు పూర్తిస్థాయిలో బతికేలా సర్పంచులు లబ్ధిదారుల ద్వారా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కానీ చాలాచోట్ల ఈ పథకానికి సంబంధించి సర్పంచులు బాధ్యత తీసుకోవడంలేదు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో గ్రామ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ క్షేత్రస్థాయిలో చాలామంది ప్రజాప్రతినిధులు అందుకు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.
చర్యలు చేపడతాం
జిల్లాలో వరుస వర్షాలు, తుపానుల కారణంగా నాటిన మొక్కలు దెబ్బతిన్నాయి. లబ్ధిదారుల్లో అవగాహన కల్పించి మొక్కల పరిరక్షణ చర్యలు చేపడతాం. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తాం. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటుతాం. వేసవిలో ప్రత్యేక నిర్వహణ చర్యలు చేపడతాం.
- ఎస్.శ్యామల, ప్లాంటేషన్ మేనేజర్, ఉపాధిహామీ పథకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.