logo

రైతు సంఘ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎస్‌.లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా కె.మోహనరావు ఎన్నికయ్యారు.

Published : 26 May 2022 06:22 IST

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎస్‌.లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా కె.మోహనరావు ఎన్నికయ్యారు. ఆఫీసు బేరర్లుగా టి.భాస్కరరావు, బి.వాసుదేవ్‌, పి.కేశవరావు, కొండయ్య, చంద్రరావు, కమిటీ సభ్యులుగా 11 మందితో కలిసి మొత్తం 20 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కమిటీ రాబోయే మూడేళ్లు రైతాంగ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తుందని నూతన అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, మోహనరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని