వీరి దానం.. నిలిపింది ప్రాణం..!
చనిపోయాక మట్టిలో కలిసిపోయే అవయవాలు ఆపదలో ఉన్న మరో మనిషి ప్రాణాన్ని నిలుపుతున్నాయి. మరణశయ్యపై ఉన్నవారి శరీర భాగాలు మరొకరి ఊపిరి నిలిపేందుకు దోహదపడుతున్నాయి. ఆత్మీయులను కోల్పోయామనే దుఃఖంలోనూ వారు మరొకరిలో బతికి ఉంటున్నారనే భావన అవయవ దానంతో సాధ్యమవుతోంది.
చనిపోయాక మట్టిలో కలిసిపోయే అవయవాలు ఆపదలో ఉన్న మరో మనిషి ప్రాణాన్ని నిలుపుతున్నాయి. మరణశయ్యపై ఉన్నవారి శరీర భాగాలు మరొకరి ఊపిరి నిలిపేందుకు దోహదపడుతున్నాయి. ఆత్మీయులను కోల్పోయామనే దుఃఖంలోనూ వారు మరొకరిలో బతికి ఉంటున్నారనే భావన అవయవ దానంతో సాధ్యమవుతోంది. నేడు ‘అవయవదాన దినోత్సవం’ సందర్భంగా మరొకరి జీవితాల్లో వెలుగులు నింపినవారి గురించి ఓ సారి తెలుసుకుందాం..
బిడ్డ కష్టం చూసి తట్టుకోలేక...
కుమారుడు రమణతో నారాయణమ్మ
లావేరు మండలం కేశవరాయపురం గ్రామానికి చెందిన ఇనపకుర్తి రమణకు నాలుగేళ్ల కిందట రెండు కిడ్నీలు పాడైపోయాయి. మూడు నెలల పాటు డయాలసిస్ చేయించిన ప్రయోజనం లేదు. వైద్యులు కిడ్నిలు మార్చాలని చెప్పారు. ఎవరు ముందుకు రాకపోవడంతో తల్లి నారాయణమ్మ తల్లడిల్లిపోయింది. బిడ్డ కష్టం చూడలేక ఆరు పదుల వయసులో తన కిడ్నీని కుమారుడికి దానం చేసి ప్రాణం నిలబెట్టింది. ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.
- న్యూస్టుడే, లావేరు గ్రామీణం
తమ్ముడి కోసం ఆమె త్యాగం
తోడబుట్టిన తమ్ముడి రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. చలించిపోయిన అక్క తన సోదరుడితో పాటు కూతురు జీవితాన్ని నిలబెట్టాలనే తపనతో అవయవదానం చేయాలని నిర్ణయించుకుంది. నరసన్నపేట మండలంలోని బడ్డవానిపేట గ్రామానికి చెందిన జల్లు తిరుపతమ్మ. 12 ఏళ్ల క్రితం తన రెండు మూత్రపిండాల్లో ఒక దాన్ని తన తమ్ముడు వజ్జ ప్రసాదరావుకు దానం ఇచ్చి అతని జీవితంలో వెలుగులు నింపింది.
- న్యూస్టుడే, బడ్డవానిపేట (నరసన్నపేట గ్రామీణం)
నలుగురికి కొత్త జీవితం
ఇచ్ఛాపురానికి చెందిన కృష్ణ చంద్రరౌళో(52) శివాలయంలో దైవారాధన వృత్తిగా, కుటుంబ పోషణ చేసుకునేవారు. ఐదేళ్ల కిందట గ్రామంలో నడుస్తుండగానే పడిపోవడంతో తలకు తీవ్రగాయమై అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. బ్రెయిన్డెడ్ అయినట్లుగా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. భార్య శారద రౌళో, కుమారుడు జగదీశ్రౌళో స్పందించి, కృష్ణ చంద్ర రౌళో అవయవదానానికి అంగీకారం తెలిపారు. గుండె, మూత్రపిండాలు, కాలేయం, నేత్రాలు ఇతరులకు అమర్చేందుకు సమ్మతం తెలిపారు. ఆ మేరకు వైద్యులు అవయవాలను తీసి నలుగురికి అదేరోజు అమర్చారు. వారికి కొత్తజీవితాన్ని ప్రసాదించారు.
- న్యూస్టుడే, ఇచ్ఛాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.