కానుక మూణ్ణాళ్లే మన్నిక..!
ప్రభుత్వ బడిలో చదువుకునే విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక పుస్తకాల బ్యాగు, మూడు జతలకు సరిపడా ఏకరూప దుస్తుల వస్త్రం, బెల్టు, బూట్లు, సాక్సులు, రాత, పాఠ్య పుస్తకాలు కలిపి విద్యాకానుకగా ప్రతి
చిరిగిన బ్యాగులు
విద్యార్థులకు తప్పని అవస్థలు
- ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, - న్యూస్టుడే, బృందం
ప్రభుత్వ బడిలో చదువుకునే విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక పుస్తకాల బ్యాగు, మూడు జతలకు సరిపడా ఏకరూప దుస్తుల వస్త్రం, బెల్టు, బూట్లు, సాక్సులు, రాత, పాఠ్య పుస్తకాలు కలిపి విద్యాకానుకగా ప్రతి విద్యార్థికి అందించింది. ప్రభుత్వం కానుక మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. నాణ్యత లేక నాసిరకంగా దర్శనమిస్తున్నాయి. బూట్లు, సాక్సులు కూడా కొన్నిచోట్ల అలాగే ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థుల చేతికొచ్చి రెండు నెలలే గడిచింది. ఈలోపే అవన్నీ చిరిగి పనికిరాకుండా పోయాయి.
కోటబొమ్మాళి మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు విద్యాశాఖ సరఫరా చేసిన బ్యాగులివి. ఇచ్చిన రెండు నెలలకే పూర్తిగా చిరిగిపోవడంతో విద్యార్థులు ఇలా పక్కన పడేశారు. చాలామంది బయట కొనుక్కున్న వాటిలోనే పుస్తకాలు పెట్టుకుంటున్నారు.
- న్యూస్టుడే, కోటబొమ్మాళి
బూర్జ మండలం పణుకుపర్త ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థి వాడుతున్న బ్యాగు ఇది. కనీసం కుట్టుకునేందుకు కూడా వీల్లేనంతగా మారింది. ప్యాడ్ పట్టేటంతటి సైజులో బ్యాగు లేకపోవడంతో దానిని చేత్తోనే పట్టుకుని, చిరిగిన బ్యాగులోనే పుస్తకాలు పెట్టుకుని ఇలా వెళ్తున్నాడు.
- న్యూస్టుడే, బూర్జ
తరగతుల వారీగా సరఫరా
విద్యార్థులకు తరగతుల వారీగా పరిమాణం గల బ్యాగులు అందించారు. 1 నుంచి 3 తరగతి వరకు చిన్న, 4 నుంచి 6 వరకు మధ్యస్థ, 7 నుంచి పదో తరగతి వరకు పెద్ద పరిమాణం గల బ్యాగులు అందించారు. జిల్లా పరిధిలోని 30 మండలాల పరిధిలో 2,657 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వీటిని సరఫరా చేశారు.
నాణ్యతగా ఉంటాయని చెప్పినా..
ప్రభుత్వం విద్యాకానుక సామగ్రి కోసం ఒక్కో విద్యార్థికి సుమారు రూ.2 వేలు ఖర్చుచేస్తోంది. బ్యాగులు, బూట్లు కనీసం ఏడాదైనా మన్నేలా ఉండాలని, పూర్తిస్థాయిలో ప్రమాణాలు పాటిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే బ్యాగులు, బూట్లు, సాక్సులు నాణ్యతతో ఉంటాయని అనుకున్నామని, రెండు నెలలకే ఇలా మారడంతో ఇబ్బందులు తప్పలేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.
జిల్లాకు తొలివిడతలో ఆరు మండలాల పరిధిలో 54 వేల బ్యాగులు వచ్చాయి. గుత్తేదారు సరఫరా చేసిన వీటి నాణ్యతను పరిశీలించిన అధికారులు లోపాలను గుర్తించి వెనక్కి పంపించేశారు. వాటిని ఆ గుత్తేదారుడు సిక్కోలుకు సమీపంలో ఉన్న మరో జిల్లాకు తీసుకెళ్లినట్లు తెలిసింది. అనంతరం మళ్లీ బ్యాగులను తీసుకొచ్చి సరఫరా చేసినా, నాణ్యతలో మాత్రం మార్పు కనిపించలేదు. విడతల వారీగా వీటిని విద్యార్థులకు అందజేశారు.
లావేరు మండలం పెదరావుపల్లి ఎంపీయూపీ పాఠశాలలో ఇచ్చిన బ్యాగులు జిప్లు ఊడి ఇలా తయారయ్యాయి. కొందరు విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని కుట్టుకుని మరీ వాడుకోవాల్సిన పరిస్థితి.
- న్యూస్టుడే, లావేరు
సారవకోట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇలా పిన్నీసులు పెట్టుకుని వాడుకుంటున్నారు. ఇచ్చిన రెండు నెలలకే ఇలా తయారయ్యాయి. బయట కొనుక్కునే బ్యాగులు కనీసం విద్యాసంవత్సరం చివరి వరకూ ఉండేవని విద్యార్థులు చెబుతున్నారు.
- న్యూస్టుడే, సారవకోట
వాటిని తిరస్కరించాం
విద్యా సంవత్సరం ప్రారంభంలో వచ్చిన బ్యాగులు, బూట్లు కొన్ని నాసిరకంగా ఉండడంతో వాటిని తిరస్కరించాం. తర్వాత మరోసారి సరఫరా చేశారు. కొన్ని చోట్ల విద్యార్థులకు వచ్చిన బ్యాగులు కొంచెం చిరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తాం.
- జయప్రకాశ్, ఏపీడీ, సమగ్రశిక్ష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్