logo

మాటు వేసి.. నోరు మూసి..

సారవకోట మండలంలోని నౌతళ గ్రామ పరిధిలో ఆదివారం పట్టపగలే ఓ దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 28 Nov 2022 04:10 IST

మహిళ మెడలో బంగారం చోరీ

సారవకోట, న్యూస్‌టుడే: సారవకోట మండలంలోని నౌతళ గ్రామ పరిధిలో ఆదివారం పట్టపగలే ఓ దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నౌతళకు చెందిన నెయ్యిల అప్పలనర్సమ్మ పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగొస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి గ్రామానికి కొద్ది దూరంలోని మట్టి రోడ్డుపై మాటు వేసి దొంగతనానికి పాల్పడ్డారు. వారిద్దరూ చరవాణులు చూసుకుంటున్నట్లు నటిస్తూనే అప్పలనర్సమ్మ మెడలో బంగారు పుస్తెలతాడు ఉన్నట్లు గుర్తించారు. అటువైపు రాగానే ఒకరు ఆమె నోటిపై గుడ్డపెట్టి మూయగా, మరొకరు మెడలోని తులం ముప్పావు బరువైన పుస్తెలతాడును తెంపి ఇద్దరూ ద్విచక్ర వాహనంపై సారవకోట వైపు వెళ్లిపోయారు. అనంతరం అప్పలనర్సమ్మ కేకలు వేయడంతో సమీప బావి వద్ద స్నానం చేస్తున్న కుమారుడితో పాటు మరికొందరు ఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకపోయింది. అప్పలనర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ. లావణ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని