logo

9 నుంచి జనసేన సమీక్షలు

జనసేన బలోపేతానికి ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ జిల్లాకు రానున్నారు.

Published : 08 Dec 2022 05:32 IST

నాలుగు రోజుల పాటు జిల్లాలోనే నాదెండ్ల మనోహర్‌

అరసవల్లి, న్యూస్‌టుడే: జనసేన బలోపేతానికి ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ జిల్లాకు రానున్నారు. 9వ తేదీ నుంచి 12 వరకు నాలుగు రోజుల పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో బస చేసి, నియోజకవర్గాలవారీగా సమీక్షలు జరపనున్నారు. స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్‌తో మాట్లాడనున్నారు. పవన్‌కల్యాణ్‌ బస్సు యాత్రకు సంబంధించి జిల్లాలో పర్యటించనున్న ప్రాంతాల రూట్‌మ్యాప్‌ గురించి సైతం చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని