చెత్త కొండంత.. సంపద గోరంత..!
పల్లెసీమలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పంచాయతీలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం ఉపాధి పథకంలో భాగంగా చెత్తసంపద కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.
అలంకారప్రాయంగానే కేంద్రాలు
గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులతో అవస్థలు
న్యూస్టుడే, లావేరు, బృందం
నిరుపయోగంగా తాళ్లవలసలోని కేంద్రం
పల్లెసీమలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పంచాయతీలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం ఉపాధి పథకంలో భాగంగా చెత్తసంపద కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ పక్క నిర్మాణాలకు స్థలం లేకపోవడం, ఉన్నచోట నిధుల కొరత, అన్నీబాగున్న చోట పర్యవేక్షణ లేకపోవడంతో ఆశించిన లక్ష్యం చేకూరడం లేదు. ఘన వ్యర్థాల నిర్వహణ, వర్మీకంపోస్టు ఎరువు తయారీ సక్రమంగా సాగడం లేదు. దీంతో ప్రధాన రహదారుల వెంట చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. అపరిశుభ్రత పల్లెలను పట్టిపీడిస్తోంది.
జిల్లాలో 30 మండలాలకు సంబంధించి 912 పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 912 ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు (ఎస్డబ్ల్యూపీసీ) మంజూరు కాగా అందులో రెండు వంతులు కేంద్రాలు నిర్మించారు. మిగిలిన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల పునాదుల్లోనే ఏళ్లతరబడి దర్శనమిస్తున్నాయి. పలు పంచాయతీల్లో షెడ్లు నిర్మాణం చేపట్టకపోవడంతో రహదారులపైనే చెత్త వేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజుకు 80 నుంచి 90 టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది.
ఘనవ్యర్థాల నిర్వహణ నామమాత్రం
జిల్లా వ్యాప్తంగా 518 పంచాయతీల్లో మాత్రమే ఘనవ్యర్థాల నిర్వహణ కొనసాగుతోంది. 394 పంచాయతీల్లో ఆ ఊసేలేదు. దీంతో పెద్దగా ఆదాయం రావడం లేదు. చెత్తను కేంద్రాల సమీపంలోనే పారబోసి తగలబెడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువులను ముక్కలుగా చేసేందుకు అవసరమైన యంత్రాలను గత ప్రభుత్వం కొన్ని పంచాయతీలకు అందజేసింది. అవి ఇప్పటివరకు వినియోగించిన దాఖలాలు లేవు. వీటిని వినియోగించుకుని ప్లాస్టిక్ వస్తువులను ముక్కలుగా చేసి ఆయా పరిశ్రమలు, తారురోడ్ల నిర్మాణంలో ఉపయోగించుకునేలా చేయగలిగితే మంచి ఆదాయం వచ్చే అవకాశముంది.
అంతంతమాత్రంగా ఆదాయం
ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాల నుంచి ఫిబ్రవరి-2022 నుంచి ఇప్పటివరకు వర్మీకంపోస్టు ఎరువు తయారీ ద్వారా రూ.6.47 లక్షలు, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తలో ఉండే ప్లాస్టిక్ డబ్బాలు, ఇనుప వస్తువులు, సీసాలు, సంచులు, అట్టపెట్టెల తదితర సామగ్రి తదితర వాటిని నుంచి రూ.5.75 లక్షల ఆదాయం సమకూరింది. వర్మీకంపోస్టు తయారు చేసేందుకు అవసరమైన తొట్టెలు అందుబాటులో ఉన్నప్పటికీ అధికారులు దృష్టిసారించడం లేదు. దీంతో ఆదాయం అరకొరగానే వస్తుంది.
ఇదీ పరిస్థితి
* టెక్కలి మేజరు పంచాయతీలో రూ.20 లక్షలతో చెత్తసంపద కేంద్రాన్ని నిర్మించారు. దీని సమీపంలో జిల్లా ఆసుపత్రి నిర్మించడంతో ఈ కేంద్రంలో చెత్త వేయడం లేదు. సేకరించిన చెత్తను జాతీయ రహదారి పక్కన వేస్తున్నారు. దీంతో సమీపంలో ఉన్న చెరువులు కలుషితం కావడంతో పాటు పరిసర గ్రామాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షల వ్యయంతో నిర్మించిన కేంద్రం ప్రస్తుతం నిరుపయోగం ఉంది. దీనినుంచి ఒక్క పైసా ఆదాయం రావడం లేదు.
* సంతబొమ్మాళి: బోరుభద్రలో సుమారు రూ.15 లక్షలతో నిర్మించిన కేంద్రం తిత్లీ తుపానుకు శిథిలమైంది. నాటినుంచి మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారు. దీంతో షెడ్డు వృథాగా పడి ఉంది. పంచాయతీలో సేకరించిన చెత్తను రోడ్ల పక్కన పడేస్తున్నారు.
* పొందూరు: కింతలి, రాపాక పంచాయతీల్లో సుమారు రూ.25 లక్షలతో కేంద్రాలను కట్టారు. ఇవి అలంకారప్రాయంగా మిలిగిపోయాయి.
* జలుమూరు: శ్రీముఖలింగంలో ఇంతవరకు చెత్తసంపద కేంద్రాన్నే నిర్మించలేదు. దీంతో చెత్త నిల్వలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. గ్రామంలో సేకరించిన చెత్తను గ్రామానికి సమీపంలో కొంత.. మరికొంత వంశధార నది ప్రాంతంలో వేస్తున్నారు.
‘కేంద్రాల్లో వర్మీకంపోస్టు తయారీకి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు పనులు పూర్తికాని షెడ్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఘనవ్యర్థాల నిర్వహణ, వర్మీకంపోస్టు ఎరువు తయారీని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నాం. దీనిపై ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.’
పి.వెంకటరాజు, జిల్లా సమన్వయకర్త (ఎస్డబ్ల్యూపీసీ) కేంద్రాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం