అధికారంలోకి రాగానే ‘నాడు-నేడు’పై విచారణ
అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు-నేడు కార్యక్రమంలో ఉపాధ్యాయులను బెదిరించి బిల్లులు తీసుకున్న నాయకులపైనా, నిర్మాణాలు చేయకుండా బిల్లులు పొందిన వారిపైనా సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు, చిత్రంలో తెదేపా నేతలు
కోటబొమ్మాళి, న్యూస్టుడే: అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు-నేడు కార్యక్రమంలో ఉపాధ్యాయులను బెదిరించి బిల్లులు తీసుకున్న నాయకులపైనా, నిర్మాణాలు చేయకుండా బిల్లులు పొందిన వారిపైనా సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. చిన్నబమ్మిడి పంచాయతీ సుబ్బారావుపేట గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అచ్చెన్నాయుడు వద్ద ఏకరవు పెట్టారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అప్పనంగా ప్రభుత్వ సొమ్ము చెల్లించేందుకే ఆ పనులని, ప్రభుత్వం మారాక పిల్లలు పెరిగారని గొప్పగా చెప్పారని ఇప్పుడు వాస్తవాలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. విద్యా ప్రమాణాలు పెంచడమంటే పాఠశాలలు మూసివేయటం కాదని, ప్రతీ తరగతికి ఓ ఉపాధ్యాయుడిని నియమించి ఏటా డీఎస్సీ తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ భక్షకులు
[ 10-05-2024]
అయిదేళ్లపాటు అవినీతి లేని పాలన అందించామంటూ సీఎం జగన్, వైకాపా నాయకులు ప్రచారాల్లో గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో కొందరు ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల దందాలు సాగించారు. -
అధ్యక్షా.. ఆమదాలవలసకు ఏం చేశారు?
[ 10-05-2024]
శాసనసభ సభాపతి అంటే ముఖ్యమంత్రి సైతం అధ్యక్షా అని పిలిచే పదవి. అంతటి హోదాలో ఉన్న వ్యక్తి నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలి. ఐదేళ్ల పాలనలో స్వలాభం పైనే ధ్యాస పెట్టారు.. అభివృద్ధి ఊసే మరిచిపోయారు. -
ఐటీడీఏను వెళ్లగొట్టారు..!
[ 10-05-2024]
‘నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు’ అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాల్లో ప్రేమ కురిపిస్తారు. వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నట్లు నమ్మిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి కనీస భరోసా దక్కడం లేదు. -
ఇంటింటిపై జగన్ బాదుడు
[ 10-05-2024]
శ్రీకాకుళం నగరం ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న విజయ్భాస్కర్ దంపతులు ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. వృద్ధురాలైన తల్లి, కుమార్తెతో కలిసి సొంతింటిలో జీవనం సాగిస్తున్నారు. -
పోలింగ్కు 48 గంటల ముందు కీలకం
[ 10-05-2024]
పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందు అత్యంత కీలకమని, ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను అనుసరించి సిబ్బంది పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు శేఖర్ విద్యార్థి పేర్కొన్నారు. -
త్వరలోనే రామరాజ్యం
[ 10-05-2024]
రాష్ట్రానికి పట్టిన పీడ మరికొన్ని రోజుల్లో విరగడ కానుందని, త్వరలోనే రామరాజ్యం రాబోతోందని ఎంపీ రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. మొన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఇక వార్ వన్సైడ్ అయిపోయినట్లు తెలుస్తోందన్నారు. -
నెలకు రూ.4,000 పింఛను
[ 10-05-2024]
తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్సిక్స్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని పలాస, ఇచ్ఛాపురం అభ్యర్థులు శిరీష, అశోక్ తెలిపారు. రెండు నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. -
మేము రాలేం.. మీరు వెళ్లండి..!
[ 10-05-2024]
శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రచార కార్యక్రమాలకు ఆదరణ తగ్గుతోంది. నిత్యం ఆయన వెంట తిరిగే భజన బృందాలే ప్రచారాల్లో కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం దూరంగా ఉంటున్నారు. -
నెమలి పింఛంపై అప్పన్న నిజ రూపం
[ 10-05-2024]
అరసవల్లికి చెందిన ప్రముఖ సూక్ష్మ చిత్రకారుడు వాడాడ రాహుల్ పట్నాయిక్ నెమలి పింఛంపై గీసిన సింహాద్రి అప్పన్న నిజరూపం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. -
అరసవల్లిలో ద్విశతావధానం
[ 10-05-2024]
తెలుగు భాష, సాహిత్యం, అవధానం వంటి ప్రక్రియల పట్ల యువతకు ఆసక్తి కలిగించేందుకు అరసవల్లిలో ద్విశతావధానం నిర్వహించనున్నట్లు సుమిత్ర కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!