logo

‘ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి’

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సూచించారు.

Published : 31 Mar 2023 05:52 IST

చంద్రబాబునాయుడితో గుండ లక్ష్మీదేవి, ఇతర నేతలు

గుజరాతీపేట(శ్రీకాకుళం), గార, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సూచించారు. చంద్రబాబునాయుడిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవిరావు గెలుపునకు అంతా బాగా పనిచేశారని అభినందించారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని చెప్పారు. అధినేతను కలిసిన వారిలో తెదేపా గార మండల అధ్యక్ష, కార్యదర్శులు లోపింటి రాధాకృష్ణారెడ్డి, జల్లు రాజీవ్‌, శ్రీకాకుళం గ్రామీణ మండల పార్టీ అధ్యక్షుడు శీర రమణయ్య, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు బలగ చెంగలరావు, విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు పట్నాల పార్వతీశం, తెలుగు యువత నగర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని