ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందిస్తాం
‘జిల్లాలో వంశధారపై ఆధారపడిన ఆయకట్టు మొత్తానికి ఖరీఫ్లో పూర్తిస్థాయిలో సాగునీరందించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. శివారు ప్రాంతాల్లో ఏటా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాం.’
వంశధార పర్యవేక్షక ఇంజినీరు డోల తిరుమలరావు
న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్
‘జిల్లాలో వంశధారపై ఆధారపడిన ఆయకట్టు మొత్తానికి ఖరీఫ్లో పూర్తిస్థాయిలో సాగునీరందించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. శివారు ప్రాంతాల్లో ఏటా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాం.’ అని బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీరు డోల తిరుమలరావు అన్నారు. శివారు ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు చేపడుతున్న చర్యలు, జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో వివరించారు. అవి ఆయనమాటల్లోనే..
శివారు ప్రాంతాలకు ఇబ్బంది రానివ్వం
గతేడాది వర్షాభావ పరిస్థితులు, గొట్టాబ్యారేజీ, రిజర్వాయర్లో అవసరమైన మేరకు నీరు నిల్వ లేకపోవడంతో పూర్తిస్థాయిలో పంట పొలాలకు నీరందించడంలో కొంచెం జాప్యం జరిగింది. ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేసి శివారు ప్రాంతాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా కార్యాచరణను రూపొందిస్తున్నాం.
లష్కర్ల నియామకానికి చర్యలు
వంశధార ఎడమకాలువ షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. గట్లు బలహీనపడి ఏర్పడిన లీకుల ద్వారా నీరు వృథాగా పోతోంది. సాగునీరు విడుదల చేసే క్రమంలో ఎక్కడికక్కడ గట్లు తెగిపోయి దిగువకు నీరు సక్రమంగా వెళ్లడం లేదు. సాగునీటి క్రమబద్ధీకరణపై ఇంజినీర్ల బృందంతో చర్చిస్తున్నాం. అవసరమైన మేరకు లష్కర్లను నియమించి సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం.
దశలవారీగా ఆధునికీకరణ
శిథిలావస్థలో ఉన్న వంశధార ఎడమ కాలువ పనులు ఆధునికీకరణ చేపట్టకుంటే శివారు ప్రాంతాలకు ఆశించినంత స్థాయిలో సాగునీరందించడం కష్టమే. దశలవారీగా చేపట్టాల్సిన ఆ పనులకు సంబంధించి రూ.950 కోట్ల అంచనావ్యయంతో ప్రభుత్వానికి నివేదిక పంపించాం. అందుకు నిధులు ఏర్పాటుచేస్తామని ఉన్నతాధికారులు మౌఖికంగా తెలిపారు. మొదటి దశలో అండర్ టన్నెల్స్, ఆఫ్ టేక్ స్లూయీజ్లు తక్షణం పునఃనిర్మించాల్సి ఉంది. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం.
ప్రధాన సమస్యగా గుర్రపుడెక్క
శివారు ప్రాంతాలకు సాగునీరు సరఫరా చేయడంలో గుర్రపుడెక్క ప్రధాన సమస్య. 2020-21లో రూ.40 లక్షలు, 2021-22లో రూ.66 లక్షలు ఖర్చు చేశాం. ఈ ఏడాది కూడా మరో రూ.60 లక్షలు అవసరం అవుతోంది. రసాయనాల ద్వారా గుర్రపుడెక్క సమస్య నివారించవచ్చు. కానీ దిగువనున్న మానవ,పశుపక్ష్యాదులకు ఇది ప్రమాదకరం. అందుకే ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోతున్నాం. ప్రస్తుతానికి కలెక్టర్ ఆదేశాల మేరకు పొక్లెయిన్లతోనే గుర్రపుడెక్క తొలగిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాం.
అభివృద్ధి పనులు ఇవీ...
* నాగావళి-వంశధార నదుల అనుసంధాన పనులు ఇప్పటివరకు 78 శాతం పూర్తయ్యాయి. గుత్తేదారుడు కాస్త జాప్యం చేస్తున్నారు. ఈ ఖరీఫ్కు పనులు పూర్తయ్యే అవకాశం లేదు.
* గతంలో ఆఫ్షోర్ పనులు 38 శాతం జరిగి నిలిచిపోయాయి. ఇటీవల ప్రభుత్వం నిధులిచ్చింది. రైతులతో మాట్లాడి పునరావాసం, భూసేకరణకు ఉన్న అడ్డంకులను తొలగించాం. ఈ ఏడాది మరో ఏడు శాతం పనులు జరిగాయి. రెండేళ్లలో వీటిని పూర్తి చేస్తాం.
* ముఖ్యమంత్రి ఇటీవల హిరమండలం ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. సర్వే, డిజైన్లు పూర్తయ్యాయి. పంపులు, మోటార్ల కొనుగోలుకు ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్లో పనులు ప్రారంభించి డిసెంబరులో పూర్తికి ప్రయత్నిస్తున్నాం.
* హిరమండలం రిజర్వాయర్ పనులు 93 శాతం జరిగాయి. ప్రస్తుతం స్పిల్వే పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
* గొట్టా బ్యారేజీ దిగువున ఉన్న ఇసుక కొట్టుకుపోయి రాతిపరుపు(ఏప్రాన్) దిగిపోయింది. దాన్ని పునర్నిర్మించేందుకు రూ.12 కోట్లు అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపాం. ఇంకా ఆమోదం రావాల్సిఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం