నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
సార్వత్రిక ఎన్నికల తొలి ఘట్టానికి తెరలేస్తోంది.. నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా పరిధిలో పార్లమెంట్ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికారుల విస్తృత ఏర్పాట్లు
న్యూస్టుడే, కలెక్టరేట్ (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల తొలి ఘట్టానికి తెరలేస్తోంది.. నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా పరిధిలో పార్లమెంట్ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మరోవైపు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. నామపత్రాల ఘట్టంలోనే తమ బలనిరూపణ చేపట్టేలా అభ్యర్థులు ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు చేసుకుని పార్టీ శ్రేణులకు సమాచారమిచ్చారు. ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాల్లో స్తబ్దుగా నడుస్తున్న ప్రచారాలు ఊపందుకోనున్నాయి. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల అధికారిగా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ వ్యవహరించనున్నారు.
ఇవి గుర్తుంచుకోండి..
- అసెంబ్లీ అభ్యర్థి నియోజకవర్గ పరిధిలో, పార్లమెంట్ అభ్యర్థి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో నామపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
- నిబంధనల ప్రకారం అధికారిక సెలవు రోజుల్లో మిగిలిన అన్ని రోజుల్లోనూ నామపత్రాలను స్వీకరిస్తారు.
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే తీసుకుంటారు.
- ఈ ప్రక్రియ పూర్తిగా నిఘానీడన ఉంటుంది. రిటర్నింగ్ అధికారి గదిలో సీసీ కెమెరాలు ఉంటాయి. వీడియోగ్రఫీ చేస్తారు.
- కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవ్వాతాతల.. ఉసురు పోసుకుంటారా?
[ 30-04-2024]
ఓ వైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు ఇళ్లకు ఎక్కడో దూరాన ఉన్న బ్యాంకులు.. ఇవేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ పేరుతో అధికార పక్షానికి మేలు చేసేందుకు అష్టకష్టాలు పడుతోంది. -
లెక్క తేలింది
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గడువు పూర్తవ్వడంతో బరిలో నిలిచే రేసుగుర్రాల లెక్క తేలింది. -
ఖాకీలకు జగనన్న కుచ్చుటోపీ
[ 30-04-2024]
ప్రజల ధన, మాన, ప్రాణాల పరిరక్షణకు పోలీసులు నిత్యం శ్రమిస్తుంటారు. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ అహర్నిశలు విధిలో నిర్వహణలో ఉంటారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
పాలకుల పక్షపాతం.. మారని పల్లెచిత్రం..!
[ 30-04-2024]
జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మట్టి రహదారులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తెదేపా హయాంలో బీటీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. -
జెండా మారుతోంది..
[ 30-04-2024]
లావేరు మండలం సహపురం పంచాయతీ హనుమంతపురం నుంచి వైకాపాకు చెందిన 50 కుటుంబాలు సోమవారం కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు సమక్షంలో కూటమిలో చేరాయి. -
శ్రీకాకుళాన్ని మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తాం
[ 30-04-2024]
శ్రీకాకుళాన్ని మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ జయంతి పేర్కొన్నారు. -
బాబు సీఎం కావాలని దివ్యాంగుడి ప్రచారం
[ 30-04-2024]
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ దివ్యాంగుడు ఇచ్ఛాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. -
రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు
[ 30-04-2024]
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మాదిగలు, మాదిగ ఉప కులాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఆర్జే ప్రకాష్ వెల్లడించారు. -
అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలి
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారం వేళ అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలని ఎస్ఈబీ డీసీ డి.శ్రీరామచంద్రమూర్తి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్ఈబీ కార్యాలయంలో ఎస్ఈబీ ఏఎస్పీ డి.గంగాధరం అధ్యక్షతన సోమవారం ఎస్ఈబీ, ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. -
రూ.29.5 లక్షల నగదు స్వాధీనం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో సోమవారం భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. విశాఖపట్నం నుంచి మెళియాపుట్టికి ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.29.5 లక్షల నగదును శ్రీకాకుళం
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి