logo

బాబు సీఎం కావాలని దివ్యాంగుడి ప్రచారం

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ దివ్యాంగుడు ఇచ్ఛాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు సైకిల్‌ యాత్ర చేపట్టాడు.

Published : 30 Apr 2024 05:29 IST

ఇచ్ఛాపురం నుంచి రాజమహేంద్రవరానికి సైకిల్‌ యాత్ర

సైకిల్‌ యాత్ర చేపట్టిన ప్రసాద్‌ను అభినందిస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ దివ్యాంగుడు ఇచ్ఛాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు సైకిల్‌ యాత్ర చేపట్టాడు. ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన ప్రసాద్‌ మూడు చక్రాల సైకిల్‌పై మిత్రుడు బాలరాజు సహాయంతో ఇచ్ఛాపురంలో ఆదివారం బయలుదేరాడు. వీరు సోమవారం శ్రీకాకుళం నగరం చేరుకుని గుజరాతీపేటలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం వరకు ప్రచారం చేపట్టి సూపర్‌- 6 పథకాల గురించి వివరించనున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రసాద్‌, బాలరాజును ఎంపీతో పాటు పలువురు తెదేపా నాయకులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని