లెక్క తేలింది
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గడువు పూర్తవ్వడంతో బరిలో నిలిచే రేసుగుర్రాల లెక్క తేలింది.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
న్యూస్టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)
టెక్కలి: గుర్తులు కేటాయిస్తున్న సబ్కలెక్టర్ నూరుల్ కమర్
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గడువు పూర్తవ్వడంతో బరిలో నిలిచే రేసుగుర్రాల లెక్క తేలింది. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 73 మంది, శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారికి అధికారులు నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించారు.
34 మంది తప్పుకొన్నారు..
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి 25 వరకు జరిగింది. 26న వాటిని పరిశీలించిన అధికారులు సోమవారం వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 107 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా.. 34 మంది వాటిని ఉపసంహరించుకున్నారు. 73 మంది పోటీలో నిలిచారు. అత్యధికంగా ఆమదాలవలస నియోజకవర్గం నుంచి 13 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడనున్నారు. నామినేషన్లు సైతం ఇక్కడి నుంచి ఎక్కువగా దాఖలయ్యాయి. టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల నుంచి ఏడుగురు చొప్పున బరిలో నిలిచారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి 13 మంది నామపత్రాలు సమర్పించగా ఒక్కరు కూడా ఉపసంహరించుకోలేదు. అందరూ బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు వారి అదృష్టం పరీక్షించుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకొస్తున్నాయ్.. మృత్యు వాహనాలు..!
[ 21-05-2024]
మూలపేట పోర్టుతో అందరి బతుకుల్లో మార్పు వస్తుందని భావించిన అక్కడి ప్రజలకు తీరని శోకం మిగులుతోంది.. పోర్టు నిర్మాణానికి చేపడుతున్న కార్యకలాపాలు పరిసర గ్రామాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
వేట లేదు.. భృతి అందలేదు
[ 21-05-2024]
సముద్రంలో మర బోట్లతో చేపల వేట నిషేధం విధించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి సాయం అందక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి లేక జీవనం భారమై నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు. -
రేవుల్లోకి అధికారుల బృందం
[ 21-05-2024]
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించడంతో జిల్లా అధికారులు ఎట్టకేలకు కదిలారు. కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, కమిటీ సభ్యులు సోమవారం రెండు రీచ్లను పరిశీలించారు. -
వెంకన్న దర్శనం.. భక్తజన పారవశ్యం..
[ 21-05-2024]
నరసన్నపేట వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 21-05-2024]
జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధికారులను ఆదేశించారు. -
ఆశలు నీరుగార్చేశారు..!
[ 21-05-2024]
రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప, అన్నదాతల మేలు కోసం ఒరగబెట్టిందేమీ లేదనేందుకు నారాయణపురం కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
పట్టణంలో దాహం కేకలు
[ 21-05-2024]
ఇచ్ఛాపురం పురపాలకసంఘ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నాలుగు ట్యాంకర్లతో నీరు అవసరమైన చోటుకు తరలించాల్సిన అధికారులు రెండింటితోనే సరిపెడుతున్నారు. -
29 కేంద్రాల్లో 50 శాతం లోపే..!
[ 21-05-2024]
శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలకమైన నగరంలో పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేదు. మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొన్ని చోట్ల 50 శాతం కంటే తక్కువ నమోదైంది. -
పార్టీ మారారని నీటి సరఫరా నిలిపివేత
[ 21-05-2024]
వైకాపా నుంచి తెదేపాలోకి మారామని కక్ష గట్టి పైపులైన్ మరమ్మతుల పేరిట నీటి సరఫరాను నిలిపేశారంటూ గ్రామానికి చెందిన వజ్జ లోకేశ్వరరావు ఎంపీడీవో జి.భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు. -
వైకాపా ఎంపీ అభ్యర్థి గృహ నిర్బంధం
[ 21-05-2024]
వైకాపా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను నందిగాం పోలీసులు సోమవారం ఆయన స్వగ్రామం కణితివూరులో గృహ నిర్బంధం చేశారు. -
మహేంద్రతనయ నదిలో దిగి కొసమాల వాసి జలసమాధి
[ 21-05-2024]
గజపతి జిల్లా గోసాని బ్లాక్లోని బాగుసాల పంచాయతీ సదర్ మహకుమా గ్రామం గుండా ప్రవహించే మహేంద్రతనయ నదిలో పడి ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
[ 21-05-2024]
పాతపట్నం మండలం కోదూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.