ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వ్యానులో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్న స్థానికులు
లావేరు, న్యూస్టుడే: లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం నుంచి శ్రీకాకుళం వస్తున్న వ్యాను.. అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి బలంగా ఢీకొంది. ప్రమాదంలో వ్యానులో ఉన్న ఐదుగురు మహిళలు, డ్రైవర్కు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో విజయనగరంకు చెందిన స్వర్ణలత, భ్రమరాంబ, పద్మావతి, గజలక్ష్మి వీరంతా ఎచ్చెర్లలోని అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయునిలుగా పని చేస్తున్నారు. సాయి పల్లవి శ్రీకాకుళంలో ఉన్న ఓ ప్రైవేటు దంత వైద్య కళాశాలలో చదువుతుంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు వ్యాను ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో స్థానికులు వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని శ్రీకాకుళం సర్వజన, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై లావేరు ఎస్ఐ స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!
[ 06-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో కొండలు కొల్లగొట్టేశారు.. దొరికినకాడిని భూకబ్జాలకు పాల్పడ్డారు.. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేసి దాడులకు తెగబడ్డారు. అరాచకాలకు అంతులేకుండా వ్యవహరించారు. తాజాగా ఇవన్నీ అధికారికం చేసే కుట్రకు తెర లేపారు. -
పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ నిశిత పరిశీలన
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పరిశీలించారు. -
పోరాట ఫలితంగానే వేతన సవరణ
[ 06-05-2024]
పోరాట ఫలితంగానే వేతన సవరణను సాధించుకోగలిగామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘ తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి రాంబాబు పేర్కొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
[ 06-05-2024]
ఇచ్ఛాపురం పట్టణం పెద్దాకులవీధిలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న శ్రీదేవి సుష్మల్ (43) ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
ఉద్దానం ఊపిరి తీసేశారు..!
[ 06-05-2024]
‘అన్న చెప్పారంటే చేస్తారంతే’.. ఇది వైకాపా శ్రేణులు తరచూ చెప్పే మాట. జగన్ ఆదుకుంటారేమోనని ఐదేళ్లు ఎదురుచూసినా కొబ్బరి రైతులకు మాత్రం ఎలాంటి ఫలితం లేకపోయింది. దిగుబడులు నామమాత్రంగా రావడం.. పరిశ్రమ, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. -
మీరైతే.. ఇక్కడ ఇల్లు కట్టుకుంటారా జగన్..?
[ 06-05-2024]
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో వైకాపా ప్రభుత్వం చాలావరకు ఊరికి దూరంగా స్థలాలు కేటాయించింది. కొండలు, శ్మశానాల దగ్గర కాలనీలను గుర్తించారు. లేఅవుట్ల దగ్గరకు వెళ్లడానికి సరైన మార్గం లేదు. -
అయిదేళ్లుగా ఆధునికీకరణను అటకెక్కించారు..!
[ 06-05-2024]
‘వైకాపా అధికారంలోకి రాగానే నారాయణపురం ఆనకట్టను ఆధునికీకరించి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తాం.’ అంటూ గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ గొప్పలకు పోయారు. -
ఉద్యోగులకు ఓటు పరీక్ష
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఉద్యోగులు ఆపసోపాలు పడ్డారు. నరసన్నపేట జూనియర్ కళాశాలలో నియోజకవర్గానికి చెందిన 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచి ఉద్యోగుల తాకిడి నెలకొంది. -
ఇవేం ఏర్పాట్లు?
[ 06-05-2024]
శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఆదివారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గందరగోళంగా సాగింది.