logo

స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఇళయరాజా

చెన్నైలో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ ఎయిర్‌ బేస్‌ తరఫున 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.

Published : 13 Aug 2022 05:45 IST

విద్యార్థులు, నిర్వాహకులతో ఇళయరాజా

ట్రిప్లికేన్‌, న్యూస్‌టుడే: చెన్నైలో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ ఎయిర్‌ బేస్‌ తరఫున 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. చెన్నై గిండిలో ఉన్న గాంధీ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ, సంగీత దర్శకుడు ‘ఇసై జ్ఞాని’ ఇళయరాజా పాల్గొన్నారు. చెన్నై వేెల్స్‌ యూనివర్సిటీ, నెహ్రూ ప్రభుత్వ మహోన్నత పాఠశాల, జయగోపాల్‌ కరోడియా ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాలకు చెందిన వందమందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థుల కళా ప్రదర్శనలు కూడా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు జాతీయ జెండాలు, తదితరాలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని