ఆలయాల జీర్ణోద్ధరణకు నిధులు
రాష్ట్రంలో ఆదిద్రావిడ, గిరిజన నివాస ప్రాంతాల్లోని ఆలయాల జీర్ణోద్ధరణ నిధులను రూ.2 లక్షలకు పెంచామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు తెలిపారు. చెన్నై నుంగంబాక్కంలో ఉన్న దేవాదాయ శాఖ కమిషనరు కార్యాలయంలో మంగళవారం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పీకే శేఖర్ బాబు
వేలచ్చేరి, న్యూస్టుడే: రాష్ట్రంలో ఆదిద్రావిడ, గిరిజన నివాస ప్రాంతాల్లోని ఆలయాల జీర్ణోద్ధరణ నిధులను రూ.2 లక్షలకు పెంచామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు తెలిపారు. చెన్నై నుంగంబాక్కంలో ఉన్న దేవాదాయ శాఖ కమిషనరు కార్యాలయంలో మంగళవారం రాత్రి మంత్రి నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో దేవాదాయ శాఖ పద్దుల కింద చేపట్టాల్సిన పథకాలు, నిల్వలో ఉన్న పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ చరిత్రలో అసెంబ్లీలో ప్రకటించిన పథ]కాల అమలు గురించి ఎక్కువగా సమీక్షా సమావేశాలను నిర్వహించిన ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు. అనేక కోర్టు కేసులను ఎదుర్కొంటున్నామని, న్యాయమైన తీర్పులను పొందుతున్నామని తెలిపారు. ఆలయాల్లో భక్తులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గత శనివారం కొలత్తూర్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ చేపడుతున్న పనులు, అమలు చేస్తున్న పథకాల తీరు బాగుందని కితాబిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆదిద్రావిడులు, గిరిజనులు నివాస ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో జీర్ణోద్ధరణ చేపట్టడానికి నిధులను రూ.2 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. ఈ ఆలయాల సంఖ్య సంవత్సరంలో 2,500కు పెరిగిందని తెలిపారు. ఆయా ఆలయాల ప్రతినిధులకు సంబంధిత మొత్తానికి చెందిన చెక్కులు అందజేసే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనరు జే.కుమరగురుబరన్, అడిషనల్ కమిషనర్లు ఆర్ కన్నన్, ఎన్.తిరుమగళ్, సి.హరిప్రియ, జాయింటు కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా