logo

బిడ్డకు విషమిచ్చి మహిళ బలవన్మరణం

కుటుంబ కలహాలతో ఓ మహిళ కన్న బిడ్డకు విషం తాగించి బలవన్మరణానికి పాల్పడింది. పొన్నేరి సమీప కృష్ణాపురం దుర్గానగర్‌కు చెందిన నవీన్‌కుమార్‌ రైతు కూలీ. ఈయనకు భార్య శివశంకరి (24),

Published : 27 Sep 2022 01:24 IST

పొన్నేరి, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో ఓ మహిళ కన్న బిడ్డకు విషం తాగించి బలవన్మరణానికి పాల్పడింది. పొన్నేరి సమీప కృష్ణాపురం దుర్గానగర్‌కు చెందిన నవీన్‌కుమార్‌ రైతు కూలీ. ఈయనకు భార్య శివశంకరి (24), ఏడాది వయసున్న కుమారుడు శ్రావణ్‌కుమార్‌ ఉన్నాడు. నవీన్‌కుమార్‌ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం రాత్రి భర్త మద్యం తాగి రావడంతో భార్య మందలించింది. ఆవేశంతో అతను భార్యపై చేయి చేసుకుని బయటకు వెళ్లి పోయాడు. మనస్తాపానికి గురైన శివశంకరి తన కొడుకుకు పురుగుల మందు తాగించి తనూ తాగింది. విషమ స్థితిలో ఉన్న ఇద్దరినీ చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శివశంకరి మృతి చెందింది. కుమారుడు చికిత్స పొందుతున్నాడు. పొన్నేరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని