ఆసుపత్రిలో చేరిన ఈరోడ్ ఎంపీ.. ఆత్మహత్యాయత్నమంటూ వదంతులు
ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో కోవైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు రావడంతో ఎండీఎంకేలో ఉద్రిక్తత నెలకొంది.
ఆస్పత్రి వద్ద గణేశమూర్తి
విల్లివాక్కం, న్యూస్టుడే: ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో కోవైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు రావడంతో ఎండీఎంకేలో ఉద్రిక్తత నెలకొంది. 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం కేటాయించగా గణేశమూర్తి ఉదయించే సూర్యుడి గుర్తుపై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించగా దురైవైగోను అభ్యర్థిగా ప్రకటించారు. గణేశమూర్తికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. వారంరోజులుగా ఆయన మనోవేదనకు గురైౖనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఈరోడ్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోవైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పార్టీలో సమస్యల కారణంగా గణేశమూర్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని ఆయన బంధువులు, పార్టీ వర్గీయులు నిర్ధారించలేదు. 1993లో ఎండీఎంకే ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న గణేశమూర్తి 2016 నుంచి పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మాయిలు అదరగొట్టారు
[ 07-05-2024]
ప్లస్టూ పబ్లిక్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. అబ్బాయిల కన్నా ఎక్కువ ఉత్తీర్ణతశాతం సాధించారు. -
చిన్నారిపై పెంపుడు కుక్కల దాడి
[ 07-05-2024]
పార్కులో ఐదేళ్ల చిన్నారిపై రెండు పెంపుడు కుక్కలు దారుణంగా దాడిచేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. -
ఠారెత్తిస్తున్న ఎండలు!
[ 07-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు బాగా పెరిగాయి. చాలా జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలూ జారీ చేసింది. -
అంధ పాఠకులకు ప్రత్యేక యాప్
[ 07-05-2024]
సభ్యత్వం ఉన్న వారికి పుస్తకాలను అద్దెకిచ్చే పద్ధతిని ఇటీవల అన్నా సెంటినరీ గ్రంథాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ప్లస్టూ ఫలితాల విడుదల
[ 07-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులు 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 87.13 శాతం ఉత్తీర్ణత సాధించారని కమిషనర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్ వెల్లడించారు. -
చర్చనీయంగా ఏ.ఆర్.రెహమాన్ పోస్టు
[ 07-05-2024]
దివంగత హాస్యనటుడు కుమరిముత్తు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. -
వైద్య విద్యార్థుల మృతికి సీఎం సంతాపం
[ 07-05-2024]
కన్నియాకుమరి జిల్లా రాజాక్కమంగలంలోని సముద్రంలో మునిగి మృతి చెందిన వైద్య విద్యార్థుల ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విక్రవాండి ఉప ఎన్నికకు రంగం సిద్ధం!
[ 07-05-2024]
విళుపురం జిల్లా విక్రవాండి ఎమ్మెల్యే (డీఎంకే) మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. -
ఇండియా కూటమిలో డీఎంకే ఉండి ప్రయోజనమేంటి?
[ 07-05-2024]
డీఎంకే ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనమేమి లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి అన్నారు. -
పెళ్లి వరకు వచ్చిన 8 ఏళ్ల ప్రేమ
[ 07-05-2024]
కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్పేట సమీపం సిరుత్తనూర్ గ్రామానికి చెందిన గోవిందస్వామి ఏసు కుమార్తె రోస్లిన్ మేరీ (25) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. -
జయకుమార్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
[ 07-05-2024]
తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..