సిలిండర్ ధర రూ.500కు తగ్గిస్తాం
కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే వంటగ్యాస్ ధరను రూ.500కు తగ్గిస్తామని మంత్రి ఉదయనిధి స్టాలిన్ హామీ ఇచ్చారు.
ఉదయనిధి స్టాలిన్ హామీ
తిరువణ్ణామలై, న్యూస్టుడే: కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే వంటగ్యాస్ ధరను రూ.500కు తగ్గిస్తామని మంత్రి ఉదయనిధి స్టాలిన్ హామీ ఇచ్చారు. తిరువణ్ణామలై లోక్సభ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి సీఎన్ అన్నాదురైకి మద్దతుగా ఆయన స్థానిక గాంధీ విగ్రహం వద్ద ప్రచారం చేశారు. తిరువణ్ణామలైలో రూ.38 కోట్లతో కొత్త బస్టాండు ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, పట్టణ ప్రజల తాగునీటి సమస్య తీర్చడానికి రూ.56 కోట్లతో సాతనూరు డ్యామ్ నుంచి భారీ పైప్లైన్ ద్వారా నీటిని తెచ్చే పనులు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రంలో ఇండియా కూటమి పాలనకు వస్తే తిరువణ్ణామలై నుంచి చెన్నైకి రోజూ రైలు నడుపుతామని, తిరుపత్తూర్కు రైలు సేవ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న టోల్గేట్ రద్దు చేస్తామన్నారు. 2014లో రూ.450 ఉన్న వంటగ్యాస్ ధర మోదీ ప్రభుత్వంలో సుమారు రూ.1000కి చేరిందని, ప్రస్తుతం రూ.100 తగ్గించినట్లు డ్రామా వేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఆయన నాటకాన్ని నమ్మవద్దని, ఇండియా కూటమి పాలనకు వస్తే సిలిండర్ ధర రూ.500కు తగ్గిస్తామని అన్నారు. రూ.75కు లీటరు పెట్రోలు, రూ.65కు లీటరు డీజిల్ విక్రయించే ఏర్పాటు చేస్తామని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. కార్యక్రమంలో మంత్రి ఈవీ వేలు, డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంగ నాన్తాన్ కింగు ట్రైలర్ విడుదల
[ 28-04-2024]
ఆనంద్ నారాయణన్ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్కాంత్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం. -
తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలి
[ 28-04-2024]
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. -
రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు కేసు చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు
[ 28-04-2024]
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో గత నెల బాంబు పేలుడు సంభవించింది. -
కరవులో ఆదుకోనున్న క్వారీలు
[ 28-04-2024]
చెంగల్పట్టు జిల్లా పరిధిలోని గ్రామాలకు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా రాళ్ల క్వారీల నుంచి నీటిని సేకరించేందుకు చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. -
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు
[ 28-04-2024]
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి అన్యాయం
[ 28-04-2024]
కేంద్రంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. -
స్పీడ్ పోస్ట్ ద్వారా 2.5 లక్షల ఎల్ఎల్ఆర్లు
[ 28-04-2024]
‘లెర్నర్స్ లైసెన్స్’ (ఎల్ఎల్ఆర్), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను స్పీడ్ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ’ విభాగం పేర్కొంది. -
శ్రీవారిని దర్శించుకున్న దుర్గా స్టాలిన్
[ 28-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. -
నిరంతర కృషితో ఉన్నత పదవులకు..
[ 28-04-2024]
టీఎన్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో తిరుప్పూర్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగినులు ఉత్తీర్ణత సాధించారు.