logo

డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్‌

డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...

Published : 18 Apr 2024 01:07 IST

సైదాపేట, న్యూస్‌టుడే: డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... నీట్‌ రద్దు, డ్రగ్స్‌ చలామణీ, మేకెదాటు వ్యవహారం తదితర అన్ని సమస్యలపై ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ప్రశ్నించానని తెలిపారు. బదులు చెప్పలేక ముఖ్యమంత్రి తికమక పడ్డారని అన్నారు. ఇప్పుడు 40 నియోజకవర్గాల్లో అభ్యర్థుల సమక్షంలో వేదికలపై ప్రశ్నలు లేవనెత్తగా బదులివ్వలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. స్టాలిన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, నా ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా జవాబివ్వలేదన్నారు. డీఎంకే తమిళనాడును రక్షించలేని, అబద్ధపు హామీలతో ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర హక్కులను కొంచెం కూడా గౌరవించని, ఇక్కడికి రావాల్సిన నిధులివ్వకుండా భాజపా మోసం చేస్తోందని తెలిపారు. మతంతో ప్రజల్లో విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ధికి వెతుకుతున్న భాజపా ఆశలు తమిళనాడులో నెరవేరవని అన్నారు. తమిళనాడు హక్కులను కాపాడేందుకు అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు