ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా..
అభివాదం చేస్తున్న స్టాలిన్
చెన్నై, న్యూస్టుడే: ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా నగరంలో బుధవారం స్టాలిన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. బెసెంట్ నగర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 40 నియోజకవర్గాలనూ ‘ఇండియా’ కూటమి గెలుస్తుందని, దేశాని తమ కూటమే ఏలుతుందని జోస్యం చెప్పారు. మోదీ నిరంకుశత్వం, రాష్ట్రాల అధికారాలను చిదిమేయడం, ప్రజల్లో విభేధాలు సృష్టించే మతవాద వ్యాఖ్యలు అందుకు కారణమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించారని, సీపీఎం, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేశారని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం పలు అక్రమాలకు పాల్పడిందని, దాని గురించి ప్రశ్నించేవారిపై యాంటీ ఇండియన్ ముద్ర వేసిందని విమర్శించారు. ప్రజలు ఏం తినాలి, ఏం తినకూడదని కూడా నిర్ణయించాలని భాజపా భావిస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని దగా చేసిన భాజపా, రాష్ట్రాన్ని నాశనం చేసిన అన్నాడీఎంకే కూటములను ఓడించాలని పిలుపునిచ్చారు.
కమలం వికసించదు
కాంచీపురం, న్యూస్టుడే: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిసార్లు తమిళనాడుకు వచ్చి డీఎంకేకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. కాంచీపురం జిల్లా పడపై సమీపాన కరసంగాల్ ప్రాంతంలో కాంచీపురం రిజర్వు లోక్సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి జి.సెల్వం, శ్రీపెరుంబుదూర్ అభ్యర్థి టీఆర్ బాలుకు మద్దతుగా ప్రచారసభ నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డీఎంకే ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకాలను దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. నాన్ ముదల్వన్ కింద 28 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించామని, మహిళలకు ప్రతినెలా రూ.1000 అందిస్తున్నామని చెప్పారు. పదవి కోసం అన్నాడీఎంకేను పళనిసామి భాజపాకు తాకట్టు పెట్టారని, అంందుకే కమలానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని ఆరోపించారు. భాజపాతో అన్నాడీఎంకే రహస్య ఒప్పందం కుదుర్చుకొందని విమర్శించారు.
ఇండియాను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేద్దాం
చెన్నై, న్యూస్టుడే: ఇండియాను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేద్దామంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు ధీరన్ చిన్నమలై జయంతి సందర్భంగా ఎక్స్ పేజీలో సందేశాన్ని పోస్టు చేశారు. అందులో... చిన్నమలై ఓ అసమాన పోరాట యోధుడని, సామాజిక సమైక్యతకు చిహ్నమని తెలిపారు. ఆంగ్లేయులకు సింహస్వప్నంగా మారారని, చెన్నిమలై, శివన్మలైకు మధ్య అవతరించి అన్యాయపు పన్నులను దోచుకుని ప్రజలకు అందించారని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఇండియాను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేద్దామంటూ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్ టమోటా సాస్లో పురుగులు
[ 30-04-2024]
నీలగిరి జిల్లా కున్నూర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో సప్లై చేసిన టమోటా సాస్లో పురుగులు ఉండటం చూసి నటుడు విజయ్ విశ్వ దిగ్భ్రాంతి చెందారు. -
సముద్రగర్భంలోకి కార్బన్ డయాక్సైడ్
[ 30-04-2024]
భూమిపై పేరుకుపోతున్న కార్బన్ డయాక్సైడ్ (ద్ని2) ముప్పు నుంచి తప్పించుకునే దారులపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు భిన్న మార్గాల్లో అన్వేషిస్తుండగా..ఐఐటీ మద్రాస్ ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. -
ఉత్తర తమిళనాడులో 1న తీవ్రమైన వేడి గాలులు
[ 30-04-2024]
ఉత్తర తమిళనాడులో బుధవారం అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. -
ప్రకాశ్రాజ్కు అంబేడ్కర్ చుడర్ అవార్డు: వీసీకే
[ 30-04-2024]
ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్కు 2024 ఏడాదికి అంబేడ్కర్ చుడర్ అవార్డు ఇవ్వనున్నట్లు వీసీకే అధ్యక్షుడు తిరుమాళన్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం
[ 30-04-2024]
విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష సమీకృత పథకం (ఇంటిగ్రేటడ్ స్కీం) కింద చెన్నై నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు -
కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు సీఎం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు వెళ్లారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
మరో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన లారెన్స్
[ 30-04-2024]
నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ పలు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మాట్రం’ అనే సంస్థనూ ఏర్పాటు చేశారు. దాని ద్వారా నిస్సహాయకులకు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. -
పెళ్లి చేసుకోలేదని మహిళపై హత్యాయత్నం
[ 30-04-2024]
విరుదునగర్ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. -
రీ రిలీజ్కు సిద్ధంగా విజయ్ సేతుపతి సినిమాలు
[ 30-04-2024]
కోలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు