ఉచిత విద్యుత్తు వినియోగదారుల్లో అనర్హులెందరు?
గతంలో ఎస్సీ, ఎస్టీలు నివసించే ఇళ్లలో ఇప్పుడు వేరేవారు ఎవరైనా నివాసం ఉంటున్నారా.. వారి పేరున వీరు లబ్ధి పొందుతున్నారా.. లబ్ధిదారుని ఆధార్ కార్డులతో విద్యుత్తు కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా.. వంటి వివరాలను సేకరిస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో సుమారు 10 వేల మంది వరకు అనర్హులుండే అవకాశం ఉందని ఈపీడీసీఎల్ అధికారి ఒకరు తెలిపారు.
200 యూనిట్లలోపు వాడే ఎస్సీ, ఎస్టీ వర్గాలపై సర్వే
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
గతంలో ఎస్సీ, ఎస్టీలు నివసించే ఇళ్లలో ఇప్పుడు వేరేవారు ఎవరైనా నివాసం ఉంటున్నారా.. వారి పేరున వీరు లబ్ధి పొందుతున్నారా.. లబ్ధిదారుని ఆధార్ కార్డులతో విద్యుత్తు కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా.. వంటి వివరాలను సేకరిస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో సుమారు 10 వేల మంది వరకు అనర్హులుండే అవకాశం ఉందని ఈపీడీసీఎల్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ గృహవిద్యుత్తు వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తోంది. వారు వినియోగించిన విద్యుత్తుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తోంది. అయితే ఈ కేటగిరీలో కొందరు అనర్హులూ లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అసలు మొత్తం ఎంతమంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులున్నారు..వారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు.. పంచాయతీలు, కాలనీల్లో ఎంతమంది ఉంటున్నారు.. పట్టణ ప్రాంతాల్లో ఎందరున్నారు.. వారిలో ఉద్యోగాలు చేసేవారు ఎవరైనా ఉన్నారా వంటి వివరాలను సేకరించి అనర్హులను గుర్తించి వారికి నెలవారీ బిల్లింగ్ చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో విద్యుత్తు సిబ్బంది క్షేత్రస్థాయిలో వీరి వివరాలను పట్టుకుని తిరుగుతున్నారు. ప్రస్తుతం సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లుగా ఉన్న వారికి ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 14 లక్షలకు పైగా గృహవిద్యుత్తు కనెక్షన్లు ఉంటే అందులో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు 1.75 లక్షల మంది ఉన్నారు. వీరిలో మెజారిటీ పాడేరు డివిజన్లోనే ఉన్నారు. ఇదివరకు ఎక్కడున్నా కుల ధ్రువీకరణ పత్రం ఇస్తే ప్రభుత్వమిచ్చే 200 యూనిట్ల రాయితీ పరిధిలోకి వచ్చేవారు. అయితే వీరిలో పేదరికానికి ఎగువనున్నవారు సైతం ఈ రాయితీ వాడుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారందరికీ తక్షణం రాయితీ నిలిపేయాలని ఆదేశించింది.
అర్హులకు ఎక్కడున్నా రాయితీ
ఈ విషయమై విశాఖ సర్కిల్ ఎస్ఈ మహేంద్రనాథ్ వద్ద ప్రస్తావించగా ఎస్సీ, ఎస్టీల్లో అర్హులు ఎక్కడ నివసించినా వారికి రాయితీ కొనసాగుతుందని, అనర్హులకు మాత్రమే తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఈ కేటగిరీలో లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తోందన్నారు.. వారికి రాయితీ నిలిపేస్తామని చెప్పారు. మిగతా వినియోగదారులు ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!