ఓటే ఆయుధం.. అందుకోండి సత్వరం
సమాజాభివృద్ధిలో కీలకంగా మారాల్సిన యువత.. ఓటు అనే ఆయుధాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతోంది. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లాలోని యువ ఓటర్లు తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం.
నమోదుకు చొరవచూపని యువత
కొత్తగా దరఖాస్తు చేసిన యువత
నక్కపల్లి, న్యూస్టుడే: సమాజాభివృద్ధిలో కీలకంగా మారాల్సిన యువత.. ఓటు అనే ఆయుధాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతోంది. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లాలోని యువ ఓటర్లు తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. జిల్లాల విభజన తర్వాత అనకాపల్లి జిల్లా పరిధిలోకి ఆరు శాసనసభ నియోజకవర్గాలు వచ్చాయి. ఇందులో పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, నర్పీపట్నం, మాడుగుల, చోడవరం ఉన్నాయి. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా చేర్పులు, తొలగింపులు, సవరణలు, బదిలీలకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఈఆర్వో) ఆధ్వర్యంలో ఏఈఆర్వోలు పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఓటర్ల నమోదుపై దృష్టిసారించి అవగాహన కల్పిస్తున్నారు. బూత్ లెవల్ (బీఎల్వోలు) అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. కళాశాలలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను మండలాలకు సరఫరా చేశారు. బీఎల్వోల వద్దకు రాలేని వారు ఆన్లైన్లో మొబైల్ ఫోన్ ద్వారా కూడా తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది. 2023 జనవరికి 18 ఏళ్లు నిండే వారితోపాటు ఇదే ఏడాది ఏప్రిల్, జులై, అక్టోబరు నాటికి 18 ఏళ్లు నిండే వారినీ భావి ఓటర్లుగా పేర్కొంటూ ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించింది.
3, 4 తేదీల్లో..
ఓటరుగా నమోదయ్యే విషయంలో జిల్లాలో యువత దూరంగా ఉంటోంది. ఆరు నియోజకవర్గాల పరిధిలో 12,68,900 మంది ఓటర్లున్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారు 65,522 మంది ఉంటే 2137 మందే ఓటర్లుగా జాబితాలో ఉన్నారు. సుమారు 63 వేల మందికిపైగా నమోదు చేయించుకోవాల్సి ఉంది. 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారు 1.1 లక్షల మంది ఓటర్లుగా చేరాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఇంతమంది దూరంగా ఉండటంతో వీరే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కళాశాలలకు వెళ్లి అవగాహన సమావేశాలు నిర్వహించడంతోపాటు అక్కడే దరఖాస్తులు ఇచ్చి నమోదు చేయిస్తున్నారు. ప్రత్యేక ఓటరు నమోదు పేరిట డిసెంబరు 3, 4 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉంటారు. ఓటును సద్వినియోగం చేసుకోగలిగితేనే అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సమస్యలపై నిలదీసే హక్కూ ఉంటుంది.
దరఖాస్తులు స్వీకరిస్తున్న బీఎల్వోలు
ప్రత్యేక చర్యలు - పి.వెంకటరమణ, డీఆర్వో
ప్రస్తుతం యువతను ఓటర్లుగా చేర్చడంపైనే దృష్టిపెట్టాం. ప్రతి కళాశాల నుంచి ప్రిన్సిపల్ను నోడల్ అధికారిగా, ఆ కళాశాల విద్యార్థిని రాయబారిగా నియమిస్తున్నాం. వీరి ద్వారా అర్హులతో దరఖాస్తు చేయిస్తాం. 18 ఏళ్లు నిండిన/నిండుతున్న వారిని ఓటర్లుగా నమోదు చేయించేలా చూస్తాం. తహసీల్దార్లు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు