logo

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

బొబ్బిలి మండలం రాముడివలసకు చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది.  

Published : 26 Nov 2022 22:14 IST

బొబ్బిలి గ్రామీణం: బొబ్బిలి మండలం రాముడివలసకు చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాముడివలసకు చెందిన సాయికుమార్‌(23) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఎన్ని మందులు వాడినా.. వ్యాధి తగ్గకపోవడంతో మనస్థాపానికి గరయ్యాడు. దీంతో గ్రామ శివారులో పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు..  గమనించిన స్థానికులు యువకుడిని బొబ్బిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.. మృతుడి తండ్రి గంగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని