పేరుకే క్రీడా ప్రాంగణాలు..
యువతను, చిన్నారులను ఆటలవైపు మళ్లించాలి. వారిని శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దాలనేది తెలంగాణ క్రీడా ప్రాంగణాల ముఖ్య లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో వాటిని ఏర్పాటు చేస్తున్న తీరును చూస్తే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనే భరోసా కనిపించడం లేదు.
భూపాలపల్లి, న్యూస్టుడే: యువతను, చిన్నారులను ఆటలవైపు మళ్లించాలి. వారిని శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దాలనేది తెలంగాణ క్రీడా ప్రాంగణాల ముఖ్య లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో వాటిని ఏర్పాటు చేస్తున్న తీరును చూస్తే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామనే భరోసా కనిపించడం లేదు. కేవలం లెక్కల కోసం, ఉన్నతాధికారులకు చెప్పేందుకే హడావుడిగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. చిన్న పనులు చేసి మమ అనిపిస్తున్నారు. పలు చోట్ల ప్రాంగణాల్లో క్రీడా పరికరాలు కూడా అందుబాటులో లేవు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను పరిశీలిస్తే.. కేవలం రెండు, మూడు గుంటల భూమిని చదును చేసి.. అందులో నాలుగు ఇనుపరాడ్లు పాతేశారు. ఆటలు ఆడుకునేందుకు పూర్తిగా ఆ ప్రాంగణాన్ని సిద్ధం చేయడం లేదు. భూమిని మంచిగా చదును చేయాలి. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ కోర్టులు ఏర్పాటు చేయాలి. లాంగ్జంప్ ఫీ‡ట్ నిర్మించాలి. వీటిని పూర్తిస్థాయిలో పాటించడం లేదు. ఉన్నతాధికారులు ఈ పనులపై ప్రత్యేక దృష్టిసారిస్తే ప్రయోజనం ఉంటుంది. భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలో మొత్తం 30 వార్డులుండగా ఇందులో సింగరేణి యాజమాన్యం కార్మికుల కోసం అంబేడ్కర్ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసింది. ఇందులోనే వివిధ క్రీడలు ఆడుకునేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 8 వరకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాధించారు. ఇప్పటికే భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ, సుభాష్కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనకభాగంలో, సింగరేణి మిలీనియం క్వార్టర్ల ప్రాంతంలోని సూపర్బజార్ పక్కన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. మిగితా 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేయటానికి స్థలాలు కూడా గుర్తించారు.
ప్రతిపాదించినవి..
మున్సిపాలిటీ పరిధిలో ఇంకా ఐదు ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. రాంనగర్, జంగేడు కేజీబీవీ సమీపంలో, గడ్డిగానిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, ఆకుదారివాడ, మాంటిస్సోరీ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేయడానికి అధికారులు స్థలాలను గుర్తించారు. ఇప్పటికీ వీటిల్లో పనులు మొదలు పెట్టలేదు. అదేవిధంగా మంజూరునగర్, పుల్లూరిరామయ్యపల్లి, బీసీ కాలనీలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని యువత, చిన్నారులకు అనుకూలంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా క్రీడా ప్రాంగణాల్లో అన్ని రకాల క్రీడా పరికరాలను అందుబాటులో ఉండే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని పలువురు పేర్కొంటున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితి..
* మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నామమాత్రంగా పనులు చేపట్టారు. ఈ ప్రాంతం క్రీడలకు అనుకూలంగానే ఉందని, కొన్ని విషయాల్లో ఇబ్బంది ఏర్పడే ప్రమాదముంటుందని పలువురు విద్యార్థులు తెలిపారు. సెలవు రోజుల్లో క్రీడా ప్రాంగణానికి వచ్చిన వారు అదే ప్రాంతంలోని తరగతి గదులకు ముందు వరండాలో కూర్చుని మద్యం సేవించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.
* సుభాష్కాలనీ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనక భాగంలో ఇండోర్ స్టేడియం కోసం చదును చేసిన ప్రాంతంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. చుట్టూ మొక్కలు నాటి వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందులో అప్పుడప్పుడు పశువులు తిరుగుతున్నాయి తప్పా క్రీడాకారులు ఎవ్వరు కూడా వెళ్లటం లేదు. ఈ క్రీడా ప్రాంగణానికి వెళ్లడానికి సుభాష్కాలనీ ప్రధాన రోడ్డు నుంచి ఏర్పాటు చేసిన పైపుకల్వర్టు మట్టి రోడ్డు పూర్తిగా ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది.
* సింగరేణి మిలీనియం క్వార్టర్ల ఏరియాలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో అన్ని రకాల క్రీడా పరికరాలు లేవని పలువురు యువకులు తెలిపారు. మూడు ప్రాంతాల్లో నాలుగు రాడ్ల చొప్పున పాతారు. ఖోఖో ఆడేందుకు రెండు రాడ్లు బిగించారు. లాంగ్జంప్ కోసం ఫీట్ నిర్మాణానికి గుంత తీసి వదిలిపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?