మక్కకు ‘మద్దతు’న్నా రైతుకు కన్నీరే!
మొక్కజొన్నలకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలు వేసి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రెండేళ్లుగా నష్టపోయిన రైతులు ఖరీఫ్లో ఈ పంట సాగు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు కంటే అధిక ధర లభించడం
అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి
నర్సంపేట, న్యూస్టుడే
నర్సంపేట మార్కెట్లో కవర్ షెడ్డు కింద ఆరబోసిన రైతుల మక్కలు
మొక్కజొన్నలకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలు వేసి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రెండేళ్లుగా నష్టపోయిన రైతులు ఖరీఫ్లో ఈ పంట సాగు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు కంటే అధిక ధర లభించడం కొంత ఊరటనిస్తున్నా తగ్గిన పంట దిగుబడి రైతులను నిరాశ పరుస్తోంది.
ప్రభుత్వ మద్దతు ధర: క్వింటాలుకు రూ. 1962
ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న రూ. 2500-2200
మక్కల ధర పెరిగినందుకు మంచి దిగుబడి వస్తే లాభసాటిగా ఉండేదని రైతులు చెబుతున్నారు. గతేడాది ఎకరాకు 25-30 క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రస్తుతం 15-20 క్వింటాళ్లకు మించట్లేదన్నారు.
ఇదీ పరిస్థితి..
కుటుంబ ఖర్చులు, రబీలో పెట్టుబడికి ఆసరా అవుతోందని గంపెడాశతో ఖరీఫ్లో మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. జులైలో వారం రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం.. తర్వాత పక్షం రోజులు తీవ్రమైన ఎండలు కాయడం దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూ పాయని పలువురు రైతులు చెప్పారు. జులైలో క్రమం తప్పకుండా కురిసిన వర్షాలతో పంట చేన్లు జాలుపట్టి బాగా దెబ్బతిన్నాయి. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని పంట చేన్లను కాపాడుకుంటే ఆగస్టు మూడోవారంలో పీసు వేసే దశలో కురిసిన మరోసారి దెబ్బతీశాయి. దీంతో కంకుల సైజు తగ్గడంతో పంట దిగుబడి బాగా పడిపోయింది.
పడిపోతున్న ధరలు
మార్కెట్లో రోజు రోజుకు మక్కల ధర పతనమవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో క్వింటాలుకు రూ.400 తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల 25న క్వింటాలు మక్కలకు రూ.2565 పలికిన ధర బుధవారం రూ.2118కు తగ్గింది. వ్యాపారులు పథకం ప్రకారం ధర తగ్గిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నెల 21న క్వింటాలు రూ.2312 పలికితే ఆరు రోజుల్లో రూ.194 తగ్గిందంటే పరిస్థితి అర్థమవుతోంది.
సగం దిగుబడి పడిపోయింది
- పొడిశెట్టి జంపయ్య, కౌలు రైతు, జల్లి
నాది చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం. కౌలుకు తీసుకున్న రెండెకరాల్లో మొక్కజొన్న వేశాను. పెట్టుబడి ఎకరాకు రూ.50 వేలు అయింది. దిగుబడి రెండెకరాల్లో 38 క్వింటాలు వచ్చింది. పంట బాగుంటే ఎకరాకు 25-30 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఎకరాకు కౌలు రూ.18 వేలు. ఏమి మిగిలే పరిస్థితి లేదు.
ధర తగ్గిస్తున్నారు
- బానోతు బుచ్చా, ఇప్పల్తండా, నర్సంపేట
అర ఎకరంలో మక్కలు పండించాను. ఈ ఏడాది ధర మంచిగానే ఉన్నా లాభం లేకుండా పోయింది. పది రోజుల కింద క్వింటాలుకు రూ.2400-2300 కొనుగోలు చేసిన వ్యాపారులు మక్కలు రావడం ప్రారంభం కావడంతో ధర తగ్గిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?