logo

పండగకు చిన్నమ్మను తీసుకొస్తానని బయల్దేరి మృతి

దసరాకు చిన్నమ్మను తీసుకొస్తానని చెప్పి  బయల్దేరిన ఓ యువకుడు కొద్ది గంటల వ్యవధిలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.

Published : 05 Oct 2022 01:33 IST


పవన్‌(పాత చిత్రం)

పరకాల, న్యూస్‌టుడే: దసరాకు చిన్నమ్మను తీసుకొస్తానని చెప్పి  బయల్దేరిన ఓ యువకుడు కొద్ది గంటల వ్యవధిలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం జరిగింది.పోలీసుల కథనం ప్రకారం.. కమలాపూర్‌ మండలం దేశరాజుపల్లికి చెందిన కందుర్ల పవన్‌(21) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. రేగొండ మండలం గోరికొత్తపల్లిలో ఉంటున్న  చిన్నమ్మను పండగకు తీసుకురావడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. పరకాలకు చేరుకున్న తర్వాత.. ఆమె బస్సు ద్వారా కమలాపూర్‌ చేరుకున్నానని ఫోన్‌ చేసింది. దీంతో అతను తిరిగి వెళ్తుండగా, ఆర్టీసీ డిపో వద్ద ఎదురుగా వెళ్తున్న బస్సుకు తగిలాడు. తలపై నుంచి టైరు వెళ్లడంతో మృతి చెందాడు. పండగ పూట మరణించడంతో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది. సీఐ కిషన్‌, ఎస్సై ప్రశాంత్‌బాబు చేరుకుని మృతదేహాన్ని పరకాల సివిల్‌ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని