గిరిజన విద్య మిథ్య
గిరిజన విద్య మిథ్యగా మారింది. గుణాత్మక విద్యను గిరిజన సంక్షేమ అధికారులు గాలికి వదిలేశారు. అడవి బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి అధికారులు, పాలకుల్లో కొరవడింది.
పూర్తి స్థాయి ప్రధానోపాధ్యాయుడు లేని ఏటూరునాగారం ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాల
గిరిజన విద్య మిథ్యగా మారింది. గుణాత్మక విద్యను గిరిజన సంక్షేమ అధికారులు గాలికి వదిలేశారు. అడవి బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి అధికారులు, పాలకుల్లో కొరవడింది. భవనాలు, వసతులు ఉన్నా ఉపాధ్యాయులు, సిబ్బంది లేక విద్యార్థులు నష్టపోతున్నారు.
న్యూస్టుడే, ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, వసతి గృహాలు, ప్రాథమికోన్నత నుంచి ఆశ్రమ ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించిన పాఠశాలలు మొత్తం 77 ఉన్నాయి. వీటిల్లో 22,550 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులను నియమించలేదు. ఆయా పాఠశాలల్లోని సీనియర్ స్కూల్ అసిస్టెంట్కు ఇన్ఛార్జి హెచ్ఎంగా బాధ్యతలు అప్పగించారు. వారు తన పాఠ్యాంశాలు బోధించకుండా పాఠశాల నిర్వహణలోనే సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు వెనకబడిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని సగానికిపైగా పాఠశాలల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
సగానికి పైగా ఇన్ఛార్జి హెచ్ఎంలే..
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో సగానికి పైగా ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుల పాలనే కొనసాగుతోంది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పని చేసే కోడి రవీందర్ 2018 బదిలీల్లో ఇదే మండలంలోని కోమటిపల్లి బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఆ పాఠశాల సాంఘిక శాస్త్రం బోధించే స్కూల్ అసిస్టెంట్ శాంతకుమారి ఇన్ఛార్జి హెచ్ఎంగా కొనసాగుతున్నారు. తాడ్వాయి మండలం మేడారం బాలికల ఏహెచ్ఎస్లో పీజీహెచ్ఎం బదిలీ కాగా స్కూల్ అసిస్టెంట్ సరోజన ఇన్ఛార్జి హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లోని పలు పాఠశాలల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీనిపై పాలకులను, అధికారులను ప్రశ్నించే వారే కరవయ్యారు.
ఉన్నతీకరించి పోస్టుల మంజూరు మరిచారు
పలు ప్రాథమికోన్నత ఆశ్రమ పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించారు. సంబంధిత ఏహెచ్ఎస్లకు హెచ్ఎం పోస్టులను మంజూరు చేయడం మరిచిపోయారు. పలు వసతిగృహాలను ఆశ్రమ ఉన్నత పాఠశాలలుగా మర్చారు. వీటికి కూడా హెచ్ఎం పోస్టులను మంజూరు చేయలేదు. ఏటూరునాగారం బాలుర ఏయూపీఎస్ను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించి గెజిటెడ్ హెచ్ఎం పోస్టు మంజూరు చేయలేదు. భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల వసతిగృహాన్ని ఏహెచ్ఎస్గా ఉన్నతీకరించి హెచ్ఎం పోస్టును మంజూరు చేయకుండా ఏడో తరగతి వరకే కొనసాగిస్తున్నారు.
పదోన్నతులు లేక భర్తీకి ఇబ్బందులు
పోచం, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, ఏటూరునాగారం ఐటీడీఏ
ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిపివేసిన కారణంగా పీజీహెచ్ఎంల కొరత ఏర్పడింది. పదోన్నతులు ఇచ్చినప్పుడే పోస్టుల భర్తీ చేయడం సాధ్యమవుతుంది. పోస్టులు మంజూరు కాని పాఠశాలలకు మంజూరు ప్రక్రియ ప్రభుత్వ స్థాయిలో ఉంది. సంబంధిత పాఠశాలల్లో ఉన్న సీనియర్ స్కూల్ అసిస్టెంట్లతోనే హెచ్ఎం విధులు నిర్వర్తింపజేయాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?