logo

ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది.

Published : 03 Feb 2023 11:24 IST

నర్సంపేట : ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన తుమ్మ విజేందర్(43) అనే  వన్‌  గ్రామ్‌ గోల్డ్‌ వ్యాపారి  గురువారం  అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం సమాచారం అందుకున్న ఎస్సై రవీందర్‌  ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.  వ్యాపారంలో వచ్చిన నష్టాల కారణంగానే విజేందర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు చెబుతున్నా.. దీనిపై స్థానికులు, పోలీసులు అనుమానం  వ్యక్తంచేస్తున్నారు.  శవ పరీక్ష నిమిత్తం   మృతదేహాన్ని వరంగల్‌  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని