భారాసపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
రాష్ట్రంలో పనిలేకుండా తిరుగుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారాలను భారాస కార్యకర్తలు తిప్పికొట్టాలని మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు.
మాట్లాడుతున్న మంత్రి సత్యవతిరాథోడ్
మహబూబాబాద్, న్యూస్టుడే: రాష్ట్రంలో పనిలేకుండా తిరుగుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారాలను భారాస కార్యకర్తలు తిప్పికొట్టాలని మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలో నిర్వహించిన భారాస ఆత్మీయ కుటుంబ సమ్మేళనం సందర్భంగా మహబూబాబాద్ గ్రామీణ మండలం కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో సత్యవతి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలతో ప్రతిపక్ష పార్టీల్లో భయం ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించలేమని గ్రహించిన ఆ పార్టీల నాయకులు ఒక్క అబద్ధాన్ని నిజం అని ప్రజల్ని నమ్మించేందుకు వంద సార్లు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు భారాస పాలనలో చేపట్టిన అభివృద్ధి ఫలాలను వివరిస్తే మహబూబాబాద్ నియోజకవర్గంలో మూడోసారి కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కొందరు వైఎస్సార్ రాజ్యం తెస్తామని తిరుగుతున్నారని వైఎస్సార్ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతిని మళ్లీ తీసుకువస్తారా.. బయ్యారం ఉక్కు ఖనిజాన్ని తరలించుకుపోతారా అంటూ ధ్వజమెత్తారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అభాసుపాలు చేస్తుందని రాష్ట్రంలో గవర్నర్ను పావుగా వాడుకుంటూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మిగిలిపోయిన గొర్లెకాపరులకు త్వరలో మరో విడత గొర్లను పంపిణీ చేస్తామన్నారు. అర్హులైనవారికి నియోజకవర్గంలో మూడు వేల ఇళ్లు మంజూరు చేసి ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. తాను పర్యటించే ప్రతి గ్రామంలో రూ. 10 లక్షలు నిధులను మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందించిన పథకాలను వారికి గుర్తు చేయాలన్నారు. ప్రతి కార్యకర్త బూత్స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. కొన్ని వలస పక్షులు వచ్చి ఏమో మాట్లాడుతున్నాయన్నారు. వారు నోరుమెదిపితే నాలుక కోస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. తాను గతంలో ఒక్క చూపు చూస్తే ఏం జరిగిందో తెలుసుకదా? అని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్సీ, భారాస రాష్ట్ర కార్యదర్శి పురాణం సతీష్, జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు, జడ్పీటీసీ సభ్యురాలు ఎల్.ప్రియాంక, పీఏసీఎస్ ఛైర్మన్ నాయిని రంజిత్, నాయకులు తేళ్ల శ్రీనివాస్, సుధగాని మురళి, ఎల్.అశోక్, సాయిలు, ఎన్.వెంకన్న, సంద వీరన్న, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?