కర్ర దానం.. దహన సంస్కారాలకు సాయం
గ్రామంలో ఎవరైనా చనిపోతే అందరూ వెళ్లి చివరిచూపు చూసి వస్తారు. దగ్గరివారు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉంటారు. ఈ దేవరాజు మాత్రం చివరి కర్ర కాలే వరకు తోడుంటారు.. ఎలాగంటారా పేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కరాలకు అవసరమైన కర్రను ఉచితంగా సమకూరుస్తారు.
ఆదర్శంగా నిలుస్తున్న దేవరాజు దంపతులు
గ్రామంలో ఎవరైనా చనిపోతే అందరూ వెళ్లి చివరిచూపు చూసి వస్తారు. దగ్గరివారు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉంటారు. ఈ దేవరాజు మాత్రం చివరి కర్ర కాలే వరకు తోడుంటారు.. ఎలాగంటారా పేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కరాలకు అవసరమైన కర్రను ఉచితంగా సమకూరుస్తారు. ఇలా ఇప్పటి వరకు 92 పేద కుటుంబాలకు ఆసరా అయ్యారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్కు చెందిన ఈగ దేవరాజు చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు. న్యూస్టుడే, రఘునాథపల్లి, జఫర్గఢ్,
ఖిలాషాపూర్కు చెందిన ఈగ దేవరాజు తండ్రి ఈగ ధనప్రకాష్, సృజన దంపతులు ఏడాదిన్నర కిందట మృతి చెందారు. తండ్రి చేసే కర్ర వ్యాపారాన్ని తాను కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు కొద్ది రోజుల వ్యవధిలో మృతి చెందడం ఆయన్ను కలచివేసింది. వారి జ్ఞాపకార్థం ఏదైనా సేవ చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఏడాదిన్నర కిందట గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన ఒకరు చనిపోయారు. ఆయన్ను దహనం చేసేందుకు డబ్బులు లేకపోవడంతో బంధువులు విరాళాలు సేకరించారు. ఇది చూసిన దేవరాజు రూ.4 వేలు ఇవ్వడంతో పాటు దహనసంస్కారానికి అవసరమైన కర్రలు అందజేశారు. ఇక నుంచి గ్రామంలో ఎవరు చనిపోయినా ఉచితంగా కర్రలు అందిద్దామని భార్య యాదలక్ష్మి, సోదరుడు లాజర్కు చెప్పడంతో వారు అంగీకరించారు. ఇందుకోసం తల్లిదండ్రుల పేరు మీద సొంతంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో ఖిలాషాపూర్ గ్రామస్థులకే ఇచ్చేవారు.. క్రమంగా సమీపంలోని మాదాపురం, రఘునాథపల్లి మండలం కోమాల, స్టేషన్ఘన్పూర్కు చెందిన పేదలు సైతం వస్తుండడంతో వారికి కూడా దహన సంస్కారాలకు కర్ర సాయం చేస్తున్నారు.
సమాచారం అందిస్తే ..
దహన సంస్కారాకలు కర్ర కావాలని దేవరాజుకు సమాచారం ఇస్తే.. ట్రాక్టరు వచ్చేలోపు కర్ర సిద్ధం చేసి ఉంచుతారు. ఇప్పటి వరకు 92 మందికి కర్రను అందించారు. ఖిలాషాపూర్లో ఆరు నెలల కిందట వారం రోజుల్లో రోజుకు ఒకరి చొప్పున ఏడుగురు చనిపోతే కర్ర అందుబాటులో లేకపోతే తన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్లను నరికించి పంపారని గ్రామస్థులు తెలిపారు. దహనం చేసేందుకు అవసరమైన కర్రకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు అవుతుంది. 92 మందికి ఇప్పటి వరకు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. దేవరాజు పేద విద్యార్థులకు ఏటా రాత పుస్తకాలు, పదో తరగతి విద్యార్థులు పరీక్షల ప్యాడ్లు, పెన్నులు ఇతర సామగ్రిని సైతం అందజేస్తారు. కరోనా కాలంలో పేదలకు భోజనం అందించడంతో పాటు వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు.
తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికే.. : - ఈగ దేవరాజు
తల్లిదండ్రులు చిన్నతనం నుంచి తమకు ఎలాంటి కష్టం రాకుండా పెంచారు. వారు మూడు నెలల వ్యవధిలో చనిపోయారు. ఆ దుఃఖం నుంచి బయట పడేందుకు నాకు నాలుగు నెలలు పట్టింది. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేదలకు సేవ చేయాలనుకున్నాను. తండ్రి చేసే కర్ర వ్యాపారం గురించి నాకు తెలుసు. దీంతో చనిపోయిన కుటుంబాలవారు పడే బాధను గమనించి ఉచితంగా కర్ర ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా. నేను ఇంటి వద్ద అందుబాటులో లేకుంటే నా భార్య కర్ర అందిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.