మెరుగైన సేవలే లక్ష్యం
ఆర్టీసీని ప్రజలకు మరింత దగ్గరకు చేసేందుకు సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీసీ డిపోలు పలు గ్రామాలకు దూరంగా ఉన్నాయి.
హనుమకొండ బస్టాండులో ప్రయాణికుల రద్దీ (పాత చిత్రం)
హనుమకొండ చౌరస్తా, న్యూస్టుడే : ఆర్టీసీని ప్రజలకు మరింత దగ్గరకు చేసేందుకు సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీసీ డిపోలు పలు గ్రామాలకు దూరంగా ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో బస్సు ప్రయాణ సమస్యలతో పాటు శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన బస్సులు తీసుకోవాలంటే గ్రామీణులకు అవస్థలు తప్పడంలేదు. ఈ సమస్యను దూరం చేసి ఆర్టీసీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు అన్ని గ్రామాల్లో బస్ అధికారులను నియమించాలని సంస్థ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని తొమ్మిది డిపోల పరిధిలో 165 మందిని నియమించారు.
సేవలను వివరిస్తారు
గ్రామ బస్ అధికారులు ఆర్టీసీ ద్వారా అందించే సేవలను ప్రజలకు వివరిస్తారు. సురక్షిత ప్రయాణానికి బస్సులనే ఆశ్రయించాలని సూచిస్తారు. దివ్యాంగులు, విద్యార్థులకు రాయితీ పాస్లు ఇస్తున్న నేపథ్యంలో ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం గురించి చెబుతారు. ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి ఆర్టీసీ అధికారులకు చేరవేస్తారు. శుభ కార్యాలయాలకు అద్దె బస్సుల బుకింగ్కు గతంలో డిపో వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇక మీదట విలేజ్ బస్ అధికారిని సంప్రదిస్తే సరిపోతుంది. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు మహిళా సంఘాల సభ్యులు, కల్యాణ మండపాల నిర్వాహకులకు తమ చరవాణి నంబరు అందించి ఆర్టీసీ కార్యక్రమాలను వారికి వివరిస్తారు.
ప్రజలతో సత్సంబంధాలు ఉన్నవారికి..
గ్రామాల్లో నివసించే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు ఇతర ఉద్యోగులను గ్రామ బస్ అధికారులుగా నియమించారు. ప్రజలతో మంచి సంబంధాలుండి స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికి నియామకంలో ప్రాధాన్యం ఇచ్చారు. పెద్ద గ్రామాలకు ఒకరు, రెండు, మూడు చిన్న గ్రామాలకు ఒకరు చొప్పున, ఒకరికి 5 గ్రామాలు మించకుండా నియమించారు. నగరాల్లో వార్డుల వారీగా బస్సు అధికారులను నియమించారు.
అర్హులను నియమించాం
- శ్రీలత, ఆర్టీసీ రీజినల్ మేనేజర్
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్హులైన వారిని గ్రామ బస్ అధికారులుగా నియమించాం. విధులపై పూర్తిస్థాయిలో వారికి సమాచారం ఇవ్వాలి. మరికొన్ని రోజుల్లో వీరు పూర్తి సేవలు అందిస్తారు. వారికి ఆర్టీసీ సంస్థ రూపొందించిన ప్రత్యేక బుక్లెట్ అందిస్తాం. క్షేత్రస్థాయిలో ప్రయాణికుల అవసరాలు ఎప్పటికప్పుడు గుర్తించి సేవలందిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.