అవస్థల పయనం.. మరమ్మతులు గగనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారి(353సి) అస్తవ్యస్తంగా మారింది.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం..
దేవుడా.. నీవే దిక్కు
ఇక్కడ రోడ్డుపై కంకర తేలి కనిపిస్తున్నది మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వెళ్లే రహదారి. కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో రహదారి విస్తరణలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది.
న్యూస్టుడే, భూపాలపల్లి కలెక్టరేట్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారి(353సి) అస్తవ్యస్తంగా మారింది.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. అసంపూర్తిగా పనులను చేపట్టడం, అటవీ అనుమతులు సాధించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నా నిర్మాణ పనులు అసంపూర్తిగా, నాణ్యత లేకుండా చేపడుతున్నారు. దీంతో కొన్ని రోజులకే రహదారి మొత్తం దెబ్బతిని గుంతలమయంగా మారుతోంది. ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగిస్తుంటాయి. అందులో ముఖ్యంగా కాళేశ్వరం నుంచి ఇసుక లారీలు, భూపాలపల్లి నుంచి బొగ్గు లారీలు, కేటీపీపీ నుంచి బూడిద లారీలు అధిక లోడుతో ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో వెళ్తాయి. దీంతె రోడ్డంతా గుంతలమయంగా మారింది. కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్లేదారి ఇదే కావడంతో హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వాహదారులు ఈ రహదారి మీదుగానే ప్రయాణించాలి. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
పట్టించుకోని అధికారులు
జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేసేవారే కరవయ్యారు. నిత్యం ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తున్నా చూసీచూడనట్లు సంబంధింత అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల గ్రామస్థులు, యవకులు శ్రమదానంతో గుంతలను మట్టితో పూడ్చే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై ఇన్ని గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నా ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మురుగు ముంచెత్తుతోంది..
ఈ చిత్రంలో కనిపిస్తున్నది రేగొండ మండల కేంద్రంలో జాతీయ రహదారికి సంబంధించి నిర్మించిన మురుగుకాల్వ.. నిర్మాణం మధ్యలోనే నిలిపివేయడంతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద రోడ్డుపైకి పారుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు ఇళ్లలోకి వస్తుండటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అటవీ అడ్డంకులు
ఇక్కడ కనిపిస్తున్నది మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వెళ్లే రహదారి. 15 కి.మీ మేర అటవీ ప్రాంతం కావడంతో అటవీ అనుమతులు రావడం లేదు. రహదారి విస్తరణలో ఎన్ని చెట్లు పోతాయో లెక్కించి గుర్తులు పెట్టారు. అలాగే 2 కి.మీ మేర రహదారి నిర్మాణానికి కాళేశ్వరం గ్రామస్థులు భూములు కోల్పోవాల్సి రావడంతో తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
నత్తనడక.. నాసిరకం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాసిరకంగా చేపడుతుండటంతో మురుగు కాల్వలపై ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మెలు పగిపోతున్నాయి. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. పనులు చేపడుతున్న ప్రదేశంలో నీరు చల్లకపోవడంతో దుమ్ముతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కుంగిన దారి..
కాటారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు కుంగిపోయి ఒక వైపు ఎత్తుగా మారింది. దీంతో చిన్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయరహదారి పక్కన నిర్మించిన మురుగు కాల్వలు అసంపూర్తిగా ఉండటంతో వర్షపు నీరు రోడ్డుపైకి వస్తోంది.
గుత్తేదారుదే నిర్వహణ బాధ్యత..
- విద్యాసాగర్, ఈఈ, వరంగల్
జాతీయ రహదారి మరమ్మతు పనులు చేపడుతున్నాం. గుత్తేదారు నాలుగేళ్లపాటు మరమ్మతు పనులు చూసుకోవాల్సిందే. భూపాలపల్లి నుంచి చెల్పూర్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం రహదారి పనులకు సంబంధించి టెండర్ పూర్తయి గుత్తేదారు సిద్ధంగా ఉన్నారు. అటవీ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మోదీనే దేశానికి పెద్ద దిక్కు’
[ 08-05-2024]
దేశానికి మోదీనే పెద్ద దిక్కు అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు అన్నారు -
రోడ్డుపై చెట్టు విరిగిపడి యువకుడి దుర్మరణం
[ 08-05-2024]
ఈదురుగాలుల బీభత్సానికి యువకుడు బలైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. -
ఓటేద్దామని మాటిద్దాం..!
[ 08-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. భారత రాజ్యాంగం కల్పించిన మహºన్నత అవకాశాన్ని నగరంలో చాలా మంది ఓటర్లు వినియోగించుకోవడం లేదు. పోలింగ్ రోజు నాయకులను ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం లేదు -
‘కడియం, అరూరికి ఓటుతో బుద్ధిచెప్పాలి’
[ 08-05-2024]
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు సూచించారు. -
వన ప్రేమికుడు... వేలుపుల సారయ్య
[ 08-05-2024]
ఆయన వయస్సు 70 ఏళ్లు.. మొక్కల సంరక్షణకు తనదైన శ్రద్ధతో పనిచేసే నిత్య శ్రామికుడు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేలుపుల సారయ్యకు మొక్కల పెంపకమంటే ఎంతో మక్కువ. ప్రస్తుతం రామన్నగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లకిరువైపులా హరితహారం పథకం కింద పెంపకం చేపట్టిన మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టారు. -
ఎంపీ ల్యాడ్స్ కేటాయింపు ఇలా..
[ 08-05-2024]
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి.. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
హలో.. మీ ఓటు ఎటు?
[ 08-05-2024]
సిద్ధార్థ ఆఫీసుకు ఆలస్యమవుతుంటే.. చకచకా బైక్ తీసి రయ్యిమని వెళుతున్నారు. కొంతదూరం వెళ్లేసరికి ఫోన్ రింగైనట్లు అనిపించింది. -
కమలదళం,, గెలుపు వ్యూహం
[ 08-05-2024]
వరంగల్ లక్ష్మీపురలో బుధవారం భాజపా నిర్వహిస్తున్న భారీగా బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభను కాషాయ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్