నర్సంపేట భాజపా అభ్యర్థిగా పుల్లారావు
నర్సంపేట నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా నర్సంపేట పట్టణానికి చెందిన కంభంపాటి పుల్లారావు అలియాస్ ప్రతాప్ ఖరారయ్యారు.
నర్సంపేట, న్యూస్టుడే: నర్సంపేట నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా నర్సంపేట పట్టణానికి చెందిన కంభంపాటి పుల్లారావు అలియాస్ ప్రతాప్ ఖరారయ్యారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర కమిటీ నాయకులు పుల్లారావుకు సంబంధించి పార్టీ బీ-ఫాంను పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, యువమోర్చా నాయకుడు మనీశ్కు అందజేశారు. దీంతో రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి పార్టీ అభ్యర్థిగా శుక్రవారం ఉదయం అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు.
ప్రస్థానం
పుల్లారావు (ప్రతాప్) నర్సంపేటలోని ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 15 ఏళ్లకు పైగా ప్రిన్సిపల్గా పని చేశారు. 2003లో సొంతంగా కొత్తగూడ, మహబూబాబాద్, ఖానాపురం, ములుగు ప్రాంతాల్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలలను నెలకొల్పి మూడేళ్లు నడిపారు. తర్వాత నర్సంపేటలో వృత్తి విద్యా కళాశాలలను స్థాపించారు. గడిచిన మూడేళ్లుగా గీతాంజలి గ్రూప్ పాఠశాలల డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాజపాలో చేరి అంచెలంచెలుగా నాయకుడిగా ఎదిగారు.
పార్టీ విజయానికి సైనికుల వలే పని చేయాలి
నర్సంపేట, న్యూస్టుడే: క్రమశిక్షణ కలిగిన సైనికుల వలే పనిచేసి నర్సంపేటలో పార్టీ విజయ కేతనం ఎగుర వేసేలా పాటుపడాలని భాజపా జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భాజపా అభ్యర్థిగా కంభంపాటి పుల్లారావు(ప్రతాప్) శుక్రవారం నామినేషన్ వేసిన తర్వాత జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్ఠానం ఆదేశం మేరకు తాను వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల ఇన్ఛార్జిలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి పుల్లారావు, నాయకులు అశోక్రెడ్డి, నర్సింహరాములు, శ్రీనివాస్, జగన్, కుమార్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తల్లి ఆశీర్వాదం తీసుకొని
కంభంపాటి పుల్లారావు(ప్రతాప్) నామినేషన్ వేయడానికి ముందు ఇంట్లో తల్లి హైమావతి ఆశీర్వాదం తీసుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి స్థానిక శ్రీ శివాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. నామపత్రాలను దేవుడి పాదాల చెంత పెట్టి పూజలు జరిపి వేదపండితుల ఆశీర్వచనం పొందారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి అక్కడి నుంచి ప్రదర్శనగా ఆర్వో కార్యాలయం వెళ్లి నామ పత్రాలు దాఖలు చేశారు.
బయోడేటా
అభ్యర్థి: కంభంపాటి పుల్లారావు(ప్రతాప్)
విద్యార్హతలు: ఎం.కాం, బీఈడీ, పీహెచ్డీ,
జనన తేదీ: 19-06-1978, వయస్సు 45 ఏళ్లు
పుట్టిన ప్రదేశం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్దారం గ్రామం. కోన్నేళ్ల కిందట వారి కుటుంబం నర్సంపేటకు వచ్చి స్థిర పడింది.
తల్లి: హైమావతి, తండ్రి: కీ.శే.బసవయ్య, భార్య: కంభంపాటి జ్యోతి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు),
పిల్లలు: తేజస్వి (బీటెక్ మొదటి సంవత్సరం), వర్షిణి (ఇంటర్ రెండో సంవత్సరం), సోదరి: వట్టి రమాదేవి ఏంఏ బీఈడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వగ్రామానికి గౌతమ్ మృతదేహం
[ 28-04-2024]
ఈనెల 21న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి కమల్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు పార్శి గౌతమ్ కుమార్(19) మృతదేహంఏడు రోజుల అనంతరం నేడు స్వగ్రామానికి చేరుకుంది. -
కేసీఆర్ రోడ్ షో నేడు
[ 28-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం వరంగల్ నగరంలో బస్సు యాత్రలో పాల్గొనేందుకు సర్వం సిద్ధమైంది. -
తేలిన లెక్క.. అతివలే నిర్ణేతలు
[ 28-04-2024]
వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) లోక్సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
మీరెక్కడుంటే.. మేమక్కడుంటాం..!
[ 28-04-2024]
నామపత్రాల దాఖలు పర్వం పూర్తికావడంతో లోక్సభ ఎన్నికల జోరు పెరిగింది.. అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
పోలింగ్ శాతం పెంపునకు కృషి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్శాతం పెంచడానికి మెప్మా సిబ్బంది కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారిణి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. -
బోర్డు తిప్పేసిన నకిలీ వైద్యుడు
[ 28-04-2024]
జిల్లా వైద్యఆరోగ్యశాఖ, తెలంగాణ వైద్యమండలి సభ్యులు హనుమకొండలో ఓ నకిలీ వైద్యుడిని గుర్తించారు. -
ప్రజాస్వామ్యం ఓటుతోనే సాధ్యం
[ 28-04-2024]
ప్రజాస్వామ్యమనేది ఓటు ద్వారానే సాధ్యమని, ఓటు హక్కును మన ప్రాథమిక బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. -
‘వెంట ఉన్నవాళ్లే ఓట్లేయలేదు’
[ 28-04-2024]
ఓటర్లకు తన పట్ల వ్యతిరేకత లేదని, వెంట తిరిగిన వాళ్లే ఓట్లేయలేదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. -
అమ్ముడుపోని తునికాకు యూనిట్లు
[ 28-04-2024]
ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
[ 28-04-2024]
జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-04-2024]
ఎన్నికల విధుల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ లోక్సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రనవీర్ చంద్ సూచించారు. -
సంక్షేమ పాలన చూసి కాంగ్రెస్కు ఓటేయండి
[ 28-04-2024]
కులం, మతం పేరిట కాదు, కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ ప్రజాపాలన చూసి ఓట్లు వేయాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పంచదార పంపిణీ చేయాల్సిందే!
[ 28-04-2024]
చౌక ధరల దుకాణాల్లో ఇక నుంచి పంచదార తప్పనిసరిగా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా