కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
మంత్రి శ్రీధర్బాబు, విప్ లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు వివేక్వెంకటస్వామి, మక్కాన్సింగ్లను గజమాలతో సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకులు చిత్రంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
ధర్మపురి, న్యూస్టుడే: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలన్నారు. ధర్మపురి ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. గత ఎన్నికల్లో లక్ష్మణ్కుమార్ను కుట్రలతో ఓడించారని.. ప్రజలే తిరిగి మంచి మెజార్టీతో గెలిపించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని కొప్పుల ఈశ్వర్ పార్లమెంటు సభ్యుడిగా ఎలా చెల్లుతారన్నారు. ఎఫ్సీఐలో ఉద్యోగాలు అమ్ముకున్న వారికి ఎలా ఓట్లు వేస్తామన్నారు. కొద్దినెలల్లోనే ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ రూ.75 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడతారని తెలిపారు. ధర్మపురి ప్రాంతంలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయించి సాగునీటిని అందిస్తామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. పత్తిపాక రిజర్వాయర్ పనులు పూర్తిచేస్తామన్నారు. యువకుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన భాజపాకు ఓటు వేస్తే ఇబ్బందులు తప్పవన్నారు. రాహుల్గాంధీ చక్కని ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని, భవిష్యత్తుకు బంగారు బాటనిచ్చే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలన్నారు. జీరో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు వేస్తామని భాజపా చెప్పిందని, భాజపా పాలనలో యువత, మహిళలు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. తనకు ఒక్క అవకాశమిస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెళ్లి పూజలు చేశానని, స్వామి వారి సాక్షిగా పెద్దపల్లి ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ విజయంకోసం కార్యకర్తలు గడప గడపకూ తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి మాట్లాడుతూ.. భారాస పాలనలో అందరూ మోసపోయారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రేంసాగర్రావు(మంచిర్యాల), విజయ రమణారావు(పెద్దపల్లి), మక్కాన్సింగ్ (రామగుండం), గడ్డం వివేక్( చెన్నూరు) తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభ విజయవంతం.. పార్టీ శ్రేణుల్లో ఆనందం
[ 01-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు సభా ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. -
‘పది’లో సత్తా చాటారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో గతేడాది 11వ స్థానం రాగా.. ఈసారి జిల్లాను 10వ స్థానంలో నిలిపారు. -
‘సాగునీరు అందించే బాధ్యత నాదే’
[ 01-05-2024]
భీమదేరపల్లి మండలంలోని పొలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, మీ ఆశీర్వాదంతో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్రావును గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
పదిలో నాలుగో స్థానం..!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
పదిలో 16వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. -
పది మెట్లు పైకి..
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పదిలో 13వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. -
‘జిల్లా తరలింపు మాటలు నమ్మొద్దు’
[ 01-05-2024]
ములుగు జిల్లా తరలిపోతుందని ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అలాంటి మాటలు నమ్మకూడదన్నారు. -
ఎంజీఎం ఆసుపత్రి ఏడీ సరెండర్
[ 01-05-2024]
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
యువతి ఆత్మహత్య.. ఖననం చేసిన ఆరు రోజులకు పోస్టుమార్టం
[ 01-05-2024]
యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఆరు రోజులకు పోసుమార్టం చేయించిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కాజీపేట ఏసీపీ తిరుమల్ తెలిపిన వివరాల ప్రకారం.. -
రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 01-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తాడ్వాయి-పస్రా మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘ఇన్నర్ రింగ్రోడ్డు’ భూ బాధితుల ఆందోళన
[ 01-05-2024]
ఖిలావరంగల్ పరిసర ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్న అంతర వలయ రహదారి(ఇన్నర్ రింగ్ రోడ్డు) భూ బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. -
వ్యాపారి అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు
[ 01-05-2024]
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు. -
లోక్సభ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం
[ 01-05-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. వారికి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
దుకాణాల్లో అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు
[ 01-05-2024]
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి..
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య