logo

బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం

పదో తరగతి చదువుతున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణపై ఆటో డ్రైవర్‌పై కిడ్నాప్‌, పోక్సో కేసులను నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పాతబస్టాండ్‌ ప్రాంతానికి చెందిన యువకుడు యాళ్ల తేజదుర్గాప్రసాద్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు

Published : 15 Jan 2022 01:41 IST

ఆటో డ్రైవర్‌పై కిడ్నాప్‌, పోక్సో కేసు నమోదు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పదో తరగతి చదువుతున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణపై ఆటో డ్రైవర్‌పై కిడ్నాప్‌, పోక్సో కేసులను నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పాతబస్టాండ్‌ ప్రాంతానికి చెందిన యువకుడు యాళ్ల తేజదుర్గాప్రసాద్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ కొన్ని రోజులుగా ఆమె వెంట పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 11న ఆమెకు మాయమాటలు చెప్పి తన ఆటోలో తాడేపల్లిగూడెం తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అక్కడి నుంచి తప్పించుకుని ఏలూరులోని తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. బాలిక ఫిర్యాదు మేరకు టూటౌన్‌ ఎస్సై కిషోర్‌బాబు శుక్రవారం రాత్రి ఆటో డ్రైవర్‌పై కిడ్నాప్‌, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని