మనకు దక్కిందేమిటి?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి జిల్లా వాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుపై ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, పీఎం ఆవాస్ యోజన ప్రకటనపై ఇళ్లు నిర్మించుకునేవారు కొంత సంతృప్తికరంగా ఉన్నా..
కేంద్ర బడ్జెట్పై మిశ్రమ స్పందన
ఈనాడు డిజిటల్, ఏలూరు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి జిల్లా వాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుపై ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, పీఎం ఆవాస్ యోజన ప్రకటనపై ఇళ్లు నిర్మించుకునేవారు కొంత సంతృప్తికరంగా ఉన్నా.. భాగస్వామ్య వ్యాపారుల పన్ను పరిమితిని సడలించకపోవడం, వ్యవసాయానికి మరిన్ని నిధులు కేటాయించకపోవడంపై అసంతృప్తి గళం వినిపిస్తోంది. పంటలకు మద్దతు ధర, రుణ మాఫీ వంటి ప్రకటనలు చేస్తారని ఆశ పడిన రైతులకు నిరాశే ఎదురైంది. జాతీయ ప్రాజెక్టు పోలవరం గురించి ప్రస్తావనే లేకపోవడం జిల్లా వాసులను నివ్వెరపరిచింది.
రైతులకు వ్యవ‘సాయం’
ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షల మంది రైతులున్నారు. ఇందులో నాలుగు లక్షల మంది వరకు కౌలు రైతులు. బడ్జెట్లో ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల రుణాల్లో.. జిల్లా రైతులకు దాదాపు రూ.5 వేల కోట్ల వరకు అందనుంది. ఇది వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఉపయోగపడనుంది. దీన్ని ఇంకా పెంచాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పంటలకు మద్దతు ధర ఊసే లేకపోవడం అన్నదాతలను నిరాశపరిచింది. సాగుకు తోడ్పాటు అందించేందుకు 10 వేల బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో జిల్లాలో 500 వరకు వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ఉద్యోగులకు కాస్త ఊరట
ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడం ద్వారా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట లభించనుంది. జిల్లాలో దాదాపు 2 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు. ఫ్యామిలీ పింఛన్దారులు గతంలో నెలకు రూ.15 వేల వేతనం దాటితే పన్ను చెల్లించాల్సి ఉండేది. దాన్ని రూ.55 వేలకు పెంచడం ద్వారా జిల్లాలో దాదాపు లక్ష మందికి పైగా ప్రయోజనం చేకూరనుంది.
గిరిజన విద్యకు తోడ్పాటు
ఏజెన్సీ విద్యా వ్యవస్థ పటిష్ఠానికి కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల్లో 38,800 మంది ఉపాధ్యాయుల్ని నియమిస్తామని ప్రకటించారు. బుట్టాయగూడెం పరిధిలో మూడేళ్ల నుంచి ఏకలవ్య పాఠశాల నడుస్తోంది. 230 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రిన్సిపల్ మినహా మిగిలిన 10 మంది అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకం జరగనుంది.
సొంతింటికి ప్రోత్సాహం
బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టే వారికి ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం జిల్లాలో 1.5 లక్షల ఇళ్లు ఈ పథకం ద్వారా నిర్మిస్తున్నారు. తాజా నిర్ణయంతో కొత్తగా 50 వేల ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుంది.
సహకార సంఘాల దస్త్రాల ఆన్లైన్కు నిధులు
సహకార సంఘాల్లో దస్త్రాల కంప్యూటరీకరణకు నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. దేశంలోని 63 వేల సొసైటీలకు రూ.2,516 కోట్లు కేటాయించారు. కంప్యూటరీకరణ లేక పోవడంతో చాలా సంఘాల్లో రుణాలు పక్కదారి పడుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో జిల్లాలోని 250 వరకు సహకార సంఘాలకు మంచి రోజులు రానున్నాయి.
వ్యాపారులకు భారమే
ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుతో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. భాగస్వామ్య వ్యాపారులు ఇప్పటివరకు 30 శాతం వరకు పన్ను చెల్లిస్తున్నారు. బడ్జెట్లో వారికి సడలింపులు ఇవ్వకపోవడం అన్యాయం.
రాజేంద్ర, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు
కొన్ని రంగాలకే లాభం
బడ్జెట్ కొన్ని రంగాలకు లాభదాయకంగా ఉండగా.. కొన్నింటికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఆదాయ పన్ను పరిమితి పెంపుతో ఉద్యోగులకు ఊరట లభించగా.. భాగస్వామ్య వ్యాపారులకు ఆ అవకాశం లేదు. పోలవరానికి నిధుల ఊసే లేదు. రాష్ట్రానికి ప్రత్యేక నిధుల కేటాయింపు లేదు.
చిరంజీవి, ఆర్థిక నిపుణుడు, ఏలూరు
వ్యవసాయ, పౌల్ట్రీ రంగాలకు ఊతం
తణుకు గ్రామీణం, న్యూస్టుడే: వ్యవసాయ, పౌల్ట్రీ, డెయిరీ రంగాలకు రూ.20 లక్షల కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రంగాలపై ఆధారపడిన జిల్లాకు ఇది ఎంతో ఉపయోగకరం. మడ అడవులను పెంచడానికి ప్రత్యేక చొరవ చూపారు. తద్వారా తీర ప్రాంతాలకు భద్రత ఏర్పడే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చే అప్పులకు రూ.2 లక్షల కోట్ల వరకు హామీ ఇస్తామని ప్రకటించారు. ఆయా సంస్థలు ఎటువంటి ఆస్తులను హామీగా బ్యాంకులకు ఇవ్వనవసరం లేదు. ఆదాయ పన్ను రూ.7 లక్షల వరకు మినహాయింపు ఇస్తామని ప్రకటించినా.. ఈ పరిధిలోకి రావాలంటే ఎటువంటి పొదుపు మొత్తాలను పరిగణనలోకి తీసుకోమని తెలిపారు. రూ.7 లక్షల ఒక్క రూపాయి ఆదాయం వచ్చిన వ్యక్తి విధిగా రూ.25,000 పన్ను చెల్లించాల్సిందే. దీనిని పరిగణనలోకి తీసుకుని మార్జినల్ రిలీఫ్ను వర్తింపజేసి ఉంటే బాగుండేది.
చెరుకూరి శ్రీనివాసరావు, సీఏ, తణుకు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం