గొల్లపల్లి రఘునాథస్వామి ఆలయ భూముల దస్త్రాల దహనం
నూజివీడు మండలం గొల్లపల్లి రఘునాథస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో విలువైన భూముల దస్త్రాలను బుధవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసిన దస్త్రాలు
నూజివీడు రూరల్, న్యూస్టుడే: నూజివీడు మండలం గొల్లపల్లి రఘునాథస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో విలువైన భూముల దస్త్రాలను బుధవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. గురువారం ఉదయం గుర్తించిన సిబ్బంది ఈవో విశ్వేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన నూజివీడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై టి.రామకృష్ణ కాలిపోయిన దస్త్రాలను పరిశీలించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. నిందితులు కార్యాలయంలో టేబుల్పై ఉన్న కంప్యూటర్ తదితరాలను కూడా కిందపడేసేందుకు యత్నించగా.. అవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. బీరువాల తాళాలను సైతం పగులగొట్టేందుకు ప్రయత్నించి రాకపోవడంతో వదిలేశారు. సీసీ టీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులు అనుమానితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. విలువైన దస్త్రాలు ధ్వంసం చేయాలన్న ఆలోచన వెనుక ఎవరెవరున్నారు అనే విషయాలు పోలీసుల విచారణలో వెలుగులోకి రానున్నాయి.
బడాబాబుల పేరు చెప్పి నానా ఇబ్బందులు
రఘునాథస్వామి ఆలయ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు సైతం వక్ర భాష్యాలు చెబుతూ కొన్నాళ్లుగా కొందరు రైతులు కౌలు చెల్లించకుండా దేవాదాయ శాఖ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆలయానికి 3,356 ఎకరాల వ్యవసాయ, అన్నే రామకృష్ణయ్య ట్రస్టుకు చెందిన 48 ఎకరాలున్నాయి. వీటికి సంబంధించి రూ.కోట్లలో బకాయిలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు రైతులకు నోటీసులు ఇవ్వడం, వారు చెల్లింపుల దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక మెలిక పెట్టి నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఉన్నతాధికారులు ఎవరికి వారు తమకు ఎందుకు వచ్చిన వ్యవహారంగా భావించి దూరంగా ఉంటున్నారు. ఇటీవల కొందరు గ్రామస్థులు వేంపాడు భూముల విషయంలో రాద్దాంతం చేస్తున్నారు. బడాబాబుల పేరు చెప్పి బెదిరిస్తున్నారు. కాలిపోయిన దస్త్రాలు కొన్ని రామకృష్ణ ట్రస్టుకు సంబంధించినవిగా ప్రాథమిక సమాచారం. బీరువాలో ఉన్న మరికొన్నింటిని, హార్డు డిస్కును దహనం చేశారు. వీటన్నింటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.
సమాచారం భద్రంగా ఉంది
రఘునాథస్వామి, దిగవల్లి తదితర ఆలయాల భూములకు సంబంధించిన దస్త్రాలు తదితరాల సమాచారం మరో కంప్యూటర్లో భద్రంగానే ఉందని ఈవో విశ్వేశ్వరరావు తెలిపారు. పలు కార్యాలయాల్లో ఈ భూములకు సంబంధించిన దస్త్రాలు ఉన్నాయని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు రామకృష్ణ పబ్లిక్ ట్రస్టుకు సంబంధించినవి, వేంపాడు భూముల ఎంజాయ్మెంట్ రిజిస్టర్ కాలిపోయినట్లు గుర్తించామన్నారు. సమాచారం ఉదయం 9.30కు తెలిసిందని వెంటనే రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
విచారణ ప్రారంభించాం
దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఇచ్చిన సమాచారం మేరకు విచారణ ప్రారంభించాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. వీరి వెనుక ఎవరు ఉన్నారన్నది విచారణలో తేలుతుంది అని నూజివీడు రూరల్ సీఐ ఆర్.అంకబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం