శిబిరాలే.. చికిత్సల్లేవ్
తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి.
ప్రచార ఆర్భాటంగా జగనన్న సురక్ష
తణుకులో నిర్వహించిన శిబిరం (పాతచిత్రం)
తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి. ఆరోగ్యశ్రీ సేవలున్న ఆసుపత్రులకు వెళుతున్నా స్లాట్ పనిచేయడం లేదని సమాధానమిస్తున్నారని రోగుల సహాయకులు వాపోతున్నారు.
తాడేపల్లిగూడెంలో మొదటివిడత ఆరోగ్యసురక్ష శిబిరాల్లో సుమారు 120 మందిని గుర్తించగా 30 మందికి మాత్రమే శస్త్రచికిత్సలు చేశారు. ఇక తప్పక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు కొంతమంది వాపోయారు.
ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు గ్రామీణం, తాడేపల్లిగూడెం అర్బన్: ‘జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలి. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వ్యక్తి ఎవరూ ఉండకూడదు. వైద్యశిబిరాలు నిర్వహించడమే కాదు.. రోగుల ఆరోగ్యం బాగయ్యేంత వరకు ఎవరికి ఏ అవసరం ఉన్నా చేయూతనివ్వాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠనే కాకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ప్రతిష్ఠనూ పెంచుతోంది’ అధికారుల సమీక్షా సమావేశంలో జగన్మోహన్రెడ్డి అన్న మాటలివి. అయితే వారి మాటలకు క్షేత్రస్థాయిలో చేతలకు పొంతన కుదరడం లేదు.
కిట్లు ఇచ్చారు.. సేవలేవీ..
ప్రచారమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఈ శిబిరాల నిర్వహణకు ఒక్కోదానికి సుమారు రూ.25వేల వరకు కేటాయించారు. వీటి నిర్వహణకు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చయింది. ఇవి ఆయా గ్రామ/ వార్డు సచివాలయాలకు తడిసి మోపయ్యాయి. వైద్యం నిమిత్తం వచ్చిన రోగికి, వారి సహాయకులకు సైతం అవసరం ఉన్నా లేకపోయినా జగన్ ఫొటోతో ఉన్న ఆరోగ్యసురక్ష కిట్ ఉన్న సంచిని అందజేశారు. దాని విలువ కనీసం రూ.20 చొప్పున చూసినా సుమారు రూ.60 లక్షలు దాటింది. ప్రచారం కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వం రోగులకు శస్త్రచికిత్సలను ఆలస్యం చేయడం వారి ఆరోగ్యంతో ఆడుకోవడమేనని, ఒక్కోసారి ప్రాణాల మీదకు వేస్తే ఏం చేస్తారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ వాస్తవం..
జిల్లాలో ఆరోగ్య సురక్ష మొదటివిడతలో భాగంగా గతేడాది సెప్టెంబర్ 30 నుంచి 45 రోజుల పాటు 447 వైద్య శిబిరాలు నిర్వహించారు. 3.46 లక్షల మందికి వైద్యసేవలందించి, 1,678 మందిని వై.ఎస్.ఆర్.ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్సలకు సిఫార్సు చేశారు. రెండోవిడత ఆరోగ్య సురక్ష శిబిరాలు మొదలైనా తొలివిడతలో సగం మందికి కూడా శస్త్రచికిత్సలు కాలేదు. 451 మందికి మాత్రమే జరిగాయి. ఒకపక్క 14 రకాల వైద్యపరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచామని, 264 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 132 మంది మెడికల్ అధికారులు, ఇతర ఆరోగ్య సిబ్బంది.. మరోపక్క ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25లక్షలకు పెంపు అని ఊదరగొడుతున్నారు గానీ క్షేత్రస్థాయిలో మాత్రం రోగులకు చుక్కలు చూపుతున్నారు.
ఉన్నవారితో సర్దుబాటు..
జిల్లాలో ఒక జిల్లా ఆరోగ్య కేంద్రం, మూడు సీహెచ్సీలు, నాలుగు ఏరియా ఆసుపత్రులు, 34 పీహెచ్సీలు, 18 యూపీహెచ్సీలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా వాటిలో మెరుగైన వైద్యసేవలందించాల్సింది పోయి ప్రచారమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఏర్పాటు చేశారనే విమర్శలున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలోనైనా, జగనన్న ఆరోగ్య సురక్షలో వైద్యసేవలందించినా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే అదే వైద్యులే అందించారు. ప్రత్యేకంగా వైద్యుల నియామకం గాని.. సిబ్బందిని గాని భర్తీచేసిన దాఖలాలు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాలనలో.. శ్రామిక హక్కులకు సంకెళ్లు!
[ 01-05-2024]
ఒక్క అవకాశం ఇస్తే మీ జీవితాలు మార్చేస్తానంటూ గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రామికులను నిలువునా ముంచేశారు. ఏళ్లు గడిచినా హామీలను అమలు చేయకపోగా హక్కులపై గళమెత్తిన కార్మిక నేతలపై జగన్ సర్కారు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసింది. -
వైకాపాను సాగనంపుదాం..
[ 01-05-2024]
ఎన్డీయే కూటమి శ్రేణుల్లో తెదేపా అధినేత చంద్రబాబు నూతనోత్తేజాన్ని నింపారు. ప్రజాగళంలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం దెందులూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. -
కూటమి ప్రభుత్వంలో ‘పోలవరం జిల్లా’
[ 01-05-2024]
పోలవరం జిల్లా ఏర్పాటును రానున్న కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. -
పండుటాకుల ఉసురు పోసుకుంటారా?
[ 01-05-2024]
అధికార వైకాపా పింఛనుదారులతో రాజకీయ జూదం ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా సునాయాసంగా పంపిణీ చేసే అవకాశం ఉన్నా ససేమిరా అంటూ లబ్ధిదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. -
నచ్చకుంటే బదిలీ.. లేదా బలి
[ 01-05-2024]
నచ్చి, వారి అడుగులకు మడుగులొత్తే అందలమెక్కించడం...నచ్చకపోతే నరకం చూపించటం వైకాపా పాలనలో అనవాయితీగా మారింది. ఇష్టారాజ్యంగా బదిలీలు చేయించటం.. డిప్యుటేషన్పై దూరంగా విసిరేయటంతో గత అయిదేళ్లలో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. -
ఎన్నికల్లో పోలీసుల పాత్ర కీలకం
[ 01-05-2024]
ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేక పరిశీలకుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్మిశ్రా అన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీ, పార్లమెంటు నియోజకవర్గ పోలీసు పరిశీలకుడు శైలేష్కుమార్ సిన్హా, -
కరెంటు లేక కష్టాలు
[ 01-05-2024]
అసలే ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలవరం ప్రజలు సోమవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో నానా అవస్థలు పడ్డారు. జగన్నాథపేట వద్ద పరివర్తకంలో సమస్యతోపాటు పలు చోట్ల తీగలు తెగిపోవడంతో జగన్నాథపేట, -
‘అసమర్థ సీఎం.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దాం’
[ 01-05-2024]
వైకాపా అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అసమర్థ ముఖ్యమంత్రి.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దామని ఎన్డీయే నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, -
వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం
[ 01-05-2024]
వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. పవరుపేటలోని బడేటి విడిది కార్యాలయంలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన 59 ఉప కులాల వారికి జగన్ అన్యాయం చేశారన్నారు. -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
[ 01-05-2024]
దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ఓ కుటుంబంలోని ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. -
కక్ష రాజకీయాలు మనకొద్దు
[ 01-05-2024]
అభివృద్ధి అంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉండటమే అని.. తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే ఇది సాధ్యమని భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పేర్కొన్నారు. -
కదిలిన కొలువుల గుట్టు
[ 01-05-2024]
వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ తమ చేతివాటం ప్రదర్శించారు. -
5 వరకు సాగునీటి విడుదల
[ 01-05-2024]
డెల్టాలో పంట కాలువలకు మే 5వ తేదీ వరకు నీటి సరఫరా కొనసాగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. తాగునీటి వనరులతో పాటు ఆక్వా చెరువులను యుద్ధప్రాతిపదికన నింపుకొనేందుకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
నియమావళి పాటించాల్సిందే
[ 01-05-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తప్పనిసరిగా నియమావళిని కచ్చితంగా పాటించి తీరాలని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు.