జగన్ జమానాలో నిధులు దోచేసి... అభివృద్ధి ఆపేసి!
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు... వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆ పట్టుగొమ్మలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొడలిపోటు వేశారు. అయిదేళ్ల జగన్ జమానాలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది.
పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం
ఆర్థిక సంఘం నిధుల దారి మళ్లింపు
ఉత్సవ విగ్రహాల్లా సర్పంచులు
న్యూస్టుడే- పెనుమంట్ర, తణుకు గ్రామీణం, పెనుగొండ
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు... వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆ పట్టుగొమ్మలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొడలిపోటు వేశారు. అయిదేళ్ల జగన్ జమానాలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. కనీసం పాలకవర్గాలకూ తెలియకుండా నిధులు దోచేస్తూ... సర్పంచులను ఉత్సవవిగ్రహాల్లా మార్చేసింది. గతంలో పల్లెల్లో సదుపాయాల కల్పనకు వినియోగించిన ఉపాధి హామీ పథకం సామగ్రి వ్యయం(మెటీరియల్ కాంపొనెంట్) నిధులను సైతం గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు వెచ్చించింది. ప్రభుత్వ పరంగా పంచాయతీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ సొమ్మునూ జమ చేయడం లేదు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది.
ఆదాయం అంతంతమాత్రమే...
జిల్లాలో 409 పంచాయతీలున్నాయి. వీటిలో 70 శాతం చిన్న పంచాయతీలే. పన్నుల ద్వారా వీటికొచ్చే ఆదాయం అంతంతమాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు అందజేయాల్సిన నిధులను జమ చేయకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయింది. గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. తాగునీటి మోటార్లు మరమ్మతుకు గురైతే బాగు చేయించేందుకు సైతం సర్పంచులు అప్పులు చేయాల్సిన దుస్థితి. కొన్ని పంచాయతీల్లో ఉద్యోగులు రూ.లక్షల్లో అవినీతికి పాల్పడ్డగా... బాధ్యుల నుంచి రికవరీ చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అక్కడ వైకాపా నేతలే సర్పంచులుగా ఉండటంతో... ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
విద్యుత్తు బకాయిలకు చెల్లించాలంటూ....
జిల్లాకు రూ.23.78 కోట్లు టైడ్, ఆన్టైడ్ నిధులు విడుదలయ్యాయి. ఆన్టైడ్ కింద వచ్చిన సొమ్ములో 40 శాతం విద్యుత్తు బాకాయిలకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ నిధులు చెల్లించని పంచాయతీలకు నోటీసులివ్వడంతోపాటు విద్యుత్తు సరఫరా నిలిపివేసింది. ఆన్టైడ్ నిధుల్లో కొంత విద్యుత్తు బకాయిలకు పోగా... మిగతా నిధులతో ఏమి చేయగలమని పలువురు సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా ఈ నిధులతో పారిశుద్ధ్య పనులు, దాని నిర్వహణ సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లో నిధుల్లేక పారిశుద్ధ్య నిర్వహణ మొక్కుబడిగా మారింది.
అయిదేళ్లలో భ్రష్టు పట్టించారు
సర్పంచిగా గెలిచానన్న మాటే గాని పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా వైకాపా నాయకులు అడుగడుగునా అడ్డుపడ్డారు. వారిని ఎదురించి ఏవైనా పనులు చేస్తే... బిల్లులు ఎలా చేసుకుంటావో చూస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. దేశంలోనే ఘన చరిత్ర కలిగిన వేల్పూరు పంచాయతీని అయిదేళ్ల వైకాపా పాలనలో భ్రష్టు పట్టించారు.
కృష్ణవేణి, సర్పంచి, వేల్పూరు
గుర్తింపు పొందలేకపోతున్నాం
మా పంచాయతీకి మంజూరైన పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులను వైకాపా ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది. దీంతో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయా. కొన్ని పనులకు సొంత నిధులు వెచ్చించా. పంచాయతీలో నిధుల్లేకపోవడంతో ప్రజలకు న్యాయం చేయలేకపోయా.
నక్కా శ్యామలాసోని, సర్పంచి, పెనుగొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.