ఇక వడ్డింపు వంతు
ఆస్తి, మూలధనం విలువ ఆధారిత పన్ను వసూళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానానికి స్వస్తి పలికారు. కరోనా విజృంభణతో గత రెండేళ్లుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్య
పట్టణాల్లో పెరగనున్న ఆస్తి పన్ను
భీమవరం పట్టణం, న్యూస్టుడే: ఆస్తి, మూలధనం విలువ ఆధారిత పన్ను వసూళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానానికి స్వస్తి పలికారు. కరోనా విజృంభణతో గత రెండేళ్లుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఇది అదనపు భారం కానుంది. గరిష్ఠంగా 15 శాతం మాత్రమే పెంపు అని ప్రభుత్వం చెబుతున్నా స్థలం విలువ పెరిగినప్పుడల్లా పన్నుభారం పెరుగుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.
మదింపు ప్రక్రియలు.. పన్ను పెంపు విషయమై జిల్లాలోని పట్టణాలు ముసాయిదాలను ఇప్పటికే విడుదల చేశాయి. కొన్నిచోట్ల అభ్యంతరాలను అధికారుల దృష్టికి రాజకీయ నాయకులు, వామపక్షాలు తీసుకెళ్లాయి. పన్ను పెంచడంతో అద్దెలు కూడా పెరిగే అవకాశం ఉందని, ఆర్థిక ఇబ్బందులు తప్పవని విన్నవించాయి. మరోవైపు పట్టణాల్లో పాత పన్నుస్థానే కొత్త పన్ను మదింపు ప్రక్రియలను వేగవంతం చేశారు. అన్నిచోట్ల ఒకేసారి చేపడితే సర్వరు సహకరించకపోవడంతో అంచెలంచెలుగా కొనసాగిస్తున్నారు.
ఎన్నికలుంటాయనుకుని..
పట్టణాల్లో విలీనమైన గ్రామా ల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత పన్ను చెల్లిస్తున్నారో, అక్కడి స్థల విలువను నమోదు చేసేపనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్నికలు జరగనిచోట గతేడాది ఎన్నికలు ఉంటాయనే యోచనలో పన్ను పెంపుపై ఆలోచిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ ఊసే లేకపోవడంతో పన్ను పెంపు చర్యలను వేగవంతం చేశారు. పన్ను పెంపు విషయంలో ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారని భీమవరానికి చెందిన జేఎన్వీ గోపాలన్ అన్నారు. రిజిస్ట్రేషన్ విలువ పెరిగిప్పుడల్లా అదనపు భారమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. అద్దెలు కూడా మరింత పెరుగుతాయన్నారు.
రిజిస్ట్రేషన్ విలువలో నివాస భవనాలకు 0.10 శాతం నుంచి 0.50 శాతం వరకు, వాణిజ్య నిర్మాణాలకు 0.20 నుంచి 2శాతం వరకు పన్ను విధించవచ్చని జీవో 198లో పేర్కొంది. నిర్మాణానికి చదరపు అడుగుల్లోనూ, స్థలానికి చదరపు గజాల్లోనూ రెండింటి రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుని పన్ను ఖరారు చేస్తారు. పన్ను భారం ఒకేసారి చూపకుండా దఫదఫాలుగా పెంచే యోచనలో నివాసానికి మొదటి ఏడాదిలో కనిష్ఠంగా 10శాతం, గరిష్ఠంగా 15శాతం పెంపుఉంటుంది. 375 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లకు ఏడాదికి రూ.100మాత్రమే చెల్లించుకునేలా నిరుపేదలకు అవకాశం కల్పించినట్టుగా ఆయా పట్టణాల్లోని అధికారులు చెబుతున్నారు. పెంచిన పన్నును గతేడాది ఏప్రిల్ 1నుంచి అమలుచేస్తారు. గత అర్ధసంవత్సరంలో తాడేపల్లిగూడేనికి చెందిన ఓ యజమాని రూ.2వేలు చెల్లించారు. కొత్త పన్ను విధానంలో రూ.2400 చెల్లించాల్సి ఉండటంతో మిగిలిన రూ.400ను అతని నుంచి ఇప్పుడు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కొత్తగా నిర్మిత భవనాలకు పాత, కొత్త పన్నులను కలిపి ఇప్పుడు వసూలు చేస్తారు. ●
భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంతంలో 1100 చ.అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆర్సీసీ ఇంటికి అర్ధ సంవత్సర పన్నుగా రూ.1700 చెల్లిస్తున్నారు. అక్కడ చదరపు గజం స్థలం విలువ రూ.16వేలు. ప్రస్తుతం 15శాతం పన్ను పెంచితే అదనంగా రూ.250 పెరగనుంది. అంటే ఏడాదికి అదనపు భారం రూ.500 పడనుంది.
తాడేపల్లిగూడెం మెయిన్రోడ్డులో గజం స్థలం విలువ రిజిస్టరు ప్రకారం రూ.50వేలు ఉంది. ఇప్పటివరకు రూ. 8వేలు చెల్లిస్తుండగా ఇకపై ఏడాదికి అదనంగా రూ.3వేలు భారం పడనుందని ఈ ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు ఆవేదన చెందారు.
జిల్లాలో నిర్మాణాలు 1,75,026
ప్రస్తుతం ఇంటిపన్ను రూ.89.40 కోట్లు
అదనపు భారం రూ.12.6 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం