వ్యాయామ చికిత్సకు విరామం
భవిత కేంద్రాల్లో ప్రత్యేకావసరాల పిల్లలకు ఏడాదిలో 10 నెలల పాటు నిర్విరామంగా వ్యాయామ చికిత్స సేవలందిస్తుండగా, రెండు నెలలపాటు విరామమిచ్చారు. వ్యాయామచికిత్స సేవలకు సెలవులు ప్రకటించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి
భవిత కేంద్రాల్లో సేవలకు తాత్కాలిక సెలవు
కొనసాగించాలని పిల్లల తల్లిదండ్రుల వినతి
ఒంటిమిట్టలోని భవిత కేంద్రం
న్యూస్టుడే, ఒంటిమిట్ట భవిత కేంద్రాల్లో ప్రత్యేకావసరాల పిల్లలకు ఏడాదిలో 10 నెలల పాటు నిర్విరామంగా వ్యాయామ చికిత్స సేవలందిస్తుండగా, రెండు నెలలపాటు విరామమిచ్చారు. వ్యాయామచికిత్స సేవలకు సెలవులు ప్రకటించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో సొంత భవనాలున్న భవిత కేంద్రాలు 17 ఉన్నాయి. ప్రభుత్వ పక్కా భవనం లేని, అద్దె గదుల్లో నడిచేవి, బాడుగ మినహాయింపు ఉన్న మరో 34 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 27 మంది వ్యాయామ చికిత్స నిపుణుల ద్వారా బాలురు 473 మంది, బాలికలు 292 మంది సేవలు పొందుతున్నారు. పిల్లల్లో చాలామంది శారీరకంగా కీళ్లు, నరాల సమస్యతో బాధపడు తుండగా, నడవలేక, కూర్చోలేని వారికి ప్రత్యేకంగా వారంలో ఒకరోజు నిపుణుల ద్వారా వ్యాయామచికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిధుల కొరతతో కొన్నేళ్లుగా ఏటా వేసవిలో మే, జూన్ రెండు నెలలపాటు సేవలు నిలిపివేస్తున్నారు. ఈ రెండు నెలల్లో కనీసం వారాంతంలో ఒకసారి సేవలందించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. రాష్ట్ర విధానం కావడంతో జిల్లాలో తాత్కాలికంగా విరామం అమలు చేస్తున్నామని సమగ్ర శిక్ష యంత్రాంగం చెబుతోంది. ప్రైవేటుగా చేయించుకోవాలంటే ఖర్చు తడిసిమోపెడంతవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సమగ్ర శిక్ష ఏపీసీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ క్రమం తప్పకుండా పిల్లలకు వ్యాయామ చికిత్స చేయించాలని తల్లిదండ్రుల నుంచి అభ్యర్థనలొస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని, వారు అనుమతిస్తే కొనసాగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది: వైఎస్ షర్మిల
[ 04-05-2024]
పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తోంది: వైఎస్ షర్మిల
[ 04-05-2024]
జగన్ హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. -
ప్రధాని మోదీ పర్యటనపై డేగ కన్నుతో నిఘా
[ 04-05-2024]
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీˆహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్ల పాలనలో ఏం చేశావ్... కార్మికుల బతుకులు కూల్చేశావ్..!
[ 04-05-2024]
జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి. -
పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు
[ 04-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అయ్యో పాపం...!
[ 04-05-2024]
మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
[ 04-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. -
జగన్ పాపానికి ఇద్దరి బలి
[ 04-05-2024]
పింఛను కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. -
వైకాపా కంచుకోటకు బీటలు
[ 04-05-2024]
వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్, ప్రతాప్, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. -
రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు
[ 04-05-2024]
మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 04-05-2024]
పోరుమామిళ్ల, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు వైకాపా ఎర!
[ 04-05-2024]
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్