logo

25న వివాహం...అంతలోనే ప్రియుడు ఆత్మహత్య

ఓ మహిళతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 25న వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా సోమవారం పెళ్లికొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో

Updated : 24 May 2022 06:35 IST

విషయం తెలిసి ప్రియురాలూ ఆత్మహత్యాయత్నం


విజయ్‌కుమార్‌(పాత చిత్రం)

రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: ఓ మహిళతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 25న వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా సోమవారం పెళ్లికొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్వేత తెలిసిన వివరాల మేరకు...వైయస్‌ఆర్‌ జిల్లా కొండాపురానికి చెందిన విజయ్‌కుమార్‌ (40)కు 15 సంవత్సరాల కిందట వివాహం అయ్యింది. అదే జిల్లాలో స్టేషన్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా భార్యతో దూరంగా ఉంటున్నాడు. నగరంలోని టప్పచపుత్రా ప్రాంతంలో నివాసం ఉండే ఓ మహిళను గత ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. సంవత్సర కాలంగా వీరిద్దరూ రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 25న వివాహం చేసుకోవాలని నెలరోజుల కిందటే నిర్ణయం తీసుకున్నారు. అయితే..వారం రోజుల క్రితం విజయ్‌కుమార్‌ సదరు మహిళకు చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆమె టప్పచపుత్రా ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును రాజేంద్రనగర్‌ ఠాణాకు బదిలీ చేశారు. రాజేంద్రనగర్‌ పోలీసులు ఆదివారం విజయ్‌కుమార్, సదరు మహిళను ఠాణాకు  పిలిపించి  కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు. సోమవారం పెళ్లికి సంబంధించిన దుస్తులు తెచ్చుకోవడానికి సదరు మహిళ వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయ్‌కుమార్‌ కాబోయే భార్యకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. వెంటనే మహిళ ఇంటికి చేరుకుంది. కానీ అప్పటికే విజయ్‌కుమార్‌ మృతిచెందాడు. దీంతో మహిళ ఖైరతాబాద్‌ సమీపంలో ఎంఎంటీఎస్‌ రైలు కిందపడి చనిపోవాలని పట్టాలపై పడుకుంది. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా గుర్తించి కాపాడినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులంతా వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన వారు కావడంతో అతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని