ఇక లారీలు నడపలేం!
‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో భారీ వాహనాలకు పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 10న త్రైమాసిక పన్ను పెంచింది.
త్రైమాసిక పన్ను పెంచుతూ జీవో విడుదలపై యజమానుల ఆందోళన
న్యూస్టుడే, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు
‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో భారీ వాహనాలకు పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 10న త్రైమాసిక పన్ను పెంచింది. డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు రహదారులు సరిగా లేవు. వాటి గురించి ఆలోచించకుండా పన్నులెలా పెంచుతారు’ అని లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు లోడింగ్కు నిలిచిన లారీలు
వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో లారీల సంఖ్య ఎక్కువ. సిమెంటు కర్మాగారాలున్నందున ఎర్రగుంట్ల ప్రాంతంలో సుమారు 1,200 వరకు లారీలున్నట్లు అంచనా. ప్రొద్దుటూరులో 800, ముద్దనూరులో 220, రాయచోటి 1,000, కడపలో 600, మైదుకూరులో 80, పోరుమామిళ్లలో 50 వరకు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ నుంచి లారీల్లో ఎక్కువగా సిమెంటు, టమోట, తదితర కూరగాయలను కర్ణాటక రాష్ట్రానికి రవాణా చేస్తుంటారు. బెంగళూరు, బళ్లారి, హోస్పెట్, బెల్గాం, మంగళూరు, తుముకూరుతోపాటు చెన్నైకి లారీలు వెళ్తుంటాయి. సిమెంటు తర్వాత బూడిదను తీసుకెళ్లే వాహనాలు సైతం ఎక్కువ.
* ఒక్కో లారీ ద్వారా ప్రత్యక్షంగా యజమాని, ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్లతో కలిపి అయిదు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. పరోక్షంగా హమాలీలు, రహదారి పక్కన డాబాలు, హోటళ్లు ఇలా వివిధ వర్గాల వారికి ఉపాధి లభిస్తోంది. 16 టైర్ల లారీలు రూ.45 లక్షల నుంచి రూ.53 లక్షల వరకు, 14 టైర్ల లారీ అయితే రూ.38 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతోంది. సిమెంటు, బూడిదతోపాటు పచ్చి సరకులను కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు తరలిస్తుంటారు. ఇలా పన్నులు పెంచుకుంటూ పోతే లారీలను నడపలేమని యజమానులు వాపోతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లు లారీ యజమానులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఇప్పుడు కొత్త జీవో తెచ్చి 30 శాతం త్రైమాసిక పన్ను పెంచుతామనడం దారుణమని బాధిత యజమానులు వాపోతున్నారు. త్రైమాసిక పన్ను ప్రస్తుతం రూ.8,600 కడుతున్నానని, అదనంగా పెంచితే మూడు నెలలకొకసారి రూ.11 వేలకు పైగా కట్టాల్సివస్తుందని ముద్దనూరుకు చెందిన ఓ లారీ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో విడుదల చేయడం దారుణం
బాలవెంకటరెడ్డి, లారీ యజమాని, చిలంకూరు, ఎర్రగుంట్ల మండలం
రాష్ట్ర ప్రభుత్వం త్రైమాసిక పన్ను పెంచుతున్నట్లు జీవో విడుదల చేయడం దారుణం. ఇప్పటికే జీఎస్టీతోపాటు అనేక రకాల పన్నులు కడుతున్నాం. వచ్చే ఆదాయం పన్నులకే సరిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పన్నులపై కాకుండా రహదారులను బాగుచేసి, డీజిల్ ధరలను తగ్గిస్తే బాగుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
[ 07-05-2024]
రాజంపేట పార్టమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రాజ్యం అమల్లో ఉందని మాజీ సీఎం, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. ఇక్కడ జరిగే దోపిడీలు, దౌర్జన్యాలు, వైకాపా నాయకుల పాపాలకు ఆ పెద్దిరెడ్డే కారకుడని ఆరోపించారు. -
సీఎం జగన్ కంచుకోటలో ఎందుకీ కలవరం?
[ 07-05-2024]
సీఎం జగన్కే కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి పులివెందుల కంచుకోట. ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. -
రాజోలి అన్నావ్.. జోలాలి పాడావ్!
[ 07-05-2024]
మాట తప్పను..మడమ తిప్పను అని సీఎం జగన్ తరచూ అంటుంటారు. రాజోలి ఆనకట్ట విషయంలో ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు... రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీఎం జగన్ మన జిల్లా వాసే కదా ఆయన ఏదైనా శంకుస్థాపన చేస్తే అమలవుతుందని మొదట్లో ప్రజలు నమ్మారు. -
రాక్షస రాజ్యం!
[ 07-05-2024]
దుష్టులకు అవకాశమిస్తే ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారో ప్రత్యక్ష సాక్ష్యం ఈ నియోజకవర్గం. ఇక్కడ గత ఐదేళ్లుగా అరాచకం రాజ్యమేలుతోంది. తమ వ్యతిరేకులను రాచిరంపాన పెట్టే పెడపాలనతో వైకాపా నేతలు చెలరేగిపోతున్నారు. వైకాపా దత్తపుత్రులైన ఖాకీల పెద్ద మనుషులు నేతల అరాచకకాండకు నిర్లజ్జగా సహకరిస్తున్నారు. -
బోరుమంటున్న జగన్ హామీ!
[ 07-05-2024]
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయడంతో పాటు, మోటారు, పైపులు, విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేయిస్తామని సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. -
150 స్థానాల్లో కూటమి విజయం ఖాయం
[ 07-05-2024]
ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కూటమి 150 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయమని, ముస్లిం మైనార్టీలు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి వారి విజయానికి సహకరించాలని ఎమ్మెల్సీ, విశ్రాంత ఐజీ ఇక్బాల్ పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలట్లో గందరగోళం!
[ 07-05-2024]
జిల్లాలో రెండో రోజైన సోమవారం కూడా పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. పలుచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాలకు అధికారులు పంపిన ఓటర్ల జాబితాలో చాలా మంది ఉద్యోగుల పేర్లు లేకపోవడం, -
రెండో రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలట్ పోలింగ్
[ 07-05-2024]
జిల్లాలో రెండోరోజు సోమవారం పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 934 మంది ఉద్యోగులకు గాను 511 మంది ఓటేశారు. -
జగన్ హామీలు... నీటిపై రాతలు
[ 07-05-2024]
జిల్లాలో వైకాపాకు పులివెందుల తర్వాత బద్వేలు నియోజక వర్గంలోనే అత్యధికంగా ఆదరిస్తారు. అందులో అట్లూరు మండలం మరింత ఎక్కువని ఎమ్మెల్యే సుధ పలు కార్యక్రమాల్లో ప్రస్తావించారు. -
పోస్టల్ బ్యాలట్కు అధికార పార్టీ నగదు బదిలీ
[ 07-05-2024]
నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సోమవారం జరిగిన పోలింగ్లో 867 ఓటర్లకు 701 మంది హాజరయ్యారు. ఓటు వేసేందుకు వచ్చిన కొందరు అధికారులు ఎన్నికల విధులకు సంబంధించి ప్రోసీడింగ్ కాపీలు తీసుకు రాకపోవడంతో వెనక్కి పంపారు. -
వైకాపాను గెలిపిస్తే అభివృద్ధి పాతాళానికే!
[ 07-05-2024]
వైకాపాను మళ్లీ గెలిపించుకుంటే మదనపల్లె నియోజకవర్గం 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్కుమార్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన