Kuppam: నిద్ర పట్టలేదని షికారుకెళ్లి ముగ్గురి దుర్మరణం.. అంతా క్షణాల్లోనే..
స్నేహితుడి జన్మదిన వేడుకలను సరదాగా నిర్వహించుకున్న అనంతరం అర్ధరాత్రి వేళ నిద్ర పట్టలేదని.. అలా షి‘కారు’కు వెళ్లొద్దామని బయల్దేరిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదం బారిన పడి శాశ్వత నిద్రలోకి జారుకున్న విషాద ఘటన చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని చిన్నశెట్టిపల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
అతి వేగం తెచ్చిన అనర్థం
కుటుంబాల్లో తీరని శోకం
న్యూస్టుడే, కుప్పం, రాజంపేట గ్రామీణం, రైల్వేకోడూరు
నుజ్జయిన కారు
స్నేహితుడి జన్మదిన వేడుకలను సరదాగా నిర్వహించుకున్న అనంతరం అర్ధరాత్రి వేళ నిద్ర పట్టలేదని.. అలా షి‘కారు’కు వెళ్లొద్దామని బయల్దేరిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదం బారిన పడి శాశ్వత నిద్రలోకి జారుకున్న విషాద ఘటన చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని చిన్నశెట్టిపల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి పుట్టినరోజు వేడుకలకు అతని పెద్దమ్మ కుమారుడు.. మదనపల్లె మిట్స్ కళాశాల విద్యార్థి వెంకటసాయి కల్యాణ్తోపాటు పీఈఎస్లో ఎంబీబీఎస్ ఆఖరి ఏడాది విద్యార్థి శ్రీవికాస్రెడ్డి, తృతీయ ఏడాది విద్యార్థి తలారి ప్రవీణ్, పలువురు స్నేహితులు, విద్యార్థులు హాజరయ్యారు. పీఈఎస్ ఎదురుగా ప్రవీణ్ ఉంటున్న అద్దె గదిని వేడుకలకు వేదికగా మలుచుకుని శుక్ర, శనివారాల్లో సంబరాలు చేసుకున్నారు.
కుప్పం ప్రభుత్వాసుపత్రి వద్ద రోదిస్తున్న వెంకటసాయి కల్యాణ్ తల్లి, బంధువులు
అంతా క్షణాల్లోనే...
శనివారం అర్ధరాత్రి వరకు సంబరాలు చేసుకున్న విద్యార్థుల్లో కొందరు అద్దె గదిలో నిద్రపోయారు. శ్రీవికాస్రెడ్డికి కారు నడపడం సరదా కావడం.. ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో అలా తిరిగొద్దామని తలారి ప్రవీణ్తోపాటు వెంకటసాయి కల్యాణ్ను వెంటబెట్టుకొని కుప్పంకు చెందిన మరో విద్యార్థి కారులో ఆదివారం తెల్లవారుజామున బయల్దేరారు. పయనమైన నిమిషాల వ్యవధిలోనే మూడున్నర గంటల సమయంలో రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. ఈ దుర్ఘటనకు అతివేగం, అజాగ్రత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ప్రవీణ్ను కడసారి చూసేందుకు వచ్చిన కుటుంబసభ్యులు
కన్నవారికి కన్నీరు మిగిల్చి...
రాజంపేటకు చెందిన వెంకటసాయి కల్యాణ్ మృతిని తల్లిదండ్రులు సుశీలమ్మ, రమణయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలన్న ఆశ.. అడియాసగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు గ్రామీణ పరిధి పెనుబర్తికి చెందిన శ్రీవికాస్రెడ్డి వైద్య చదువులు పూర్తి చేసి కుటుంబానికి ఆదరువుగా ఉంటాడని ఆశపడిన తల్లిదండ్రులు మాధవి, సచ్ఛేంద్రరెడ్డికి కుమారుడి మరణం తీరని విషాదాన్ని మిగిల్చింది. రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన తలారి ప్రవీణ్ శాశ్వతంగా దూరం కావడాన్ని అతని తల్లిదండ్రులు గంగులమ్మ, సుబ్బరాయుడు తట్టుకోలేకపోతున్నారు. ప్రవీణ్కు ఇద్దరు అక్కలు. ఒకరు ఎంబీబీఎస్ పూర్తి చేయగా మరో సోదరి బ్యాంకులో ఉద్యోగం సాధించారు. వారి స్ఫూర్తితో వైద్య చదువును ఎంచుకున్న అతను లక్ష్యాన్ని చేరుకోకుండానే ఇలా మృత్యు కౌగిలిలోకి చేరుకోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.