సై అనాలన్నా... నై అనాలన్నా ఆయనే!
మదనపల్లె పురపాలక సంఘంలో గత రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.
ఎమ్మెల్యే ఆధిపత్యంపై పుర ఛైర్పర్సన్ గుర్రు
మదనపల్లె వైకాపాలో భగ్గుమన్న విభేదాలు
పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం రద్దు
న్యూస్టుడే, మదనపల్లె పట్టణం
మదనపల్లె పురపాలక సంఘంలో గత రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇక్కడ సాగుతున్న పరిపాలనను జీర్ణించుకోలేని కొందరు కౌన్సిలర్లు తమ ఆవేదనను కౌన్సిల్ సమావేశంలో ఛైర్పర్సన్ ఎదుట వెల్లగక్కారు. ఏకపక్ష నిర్ణయాలతో తమకు తీరని నష్టం జరుగుతోందంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధి పనుల్లో, రాజకీయంగా గుర్తింపులోనూ తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదొక ఎత్తయితే మదనపల్లె పురపాలక సంఘం ఛైర్పర్సన్ వి.మనూజ సొంతంగా ఏ నిర్ణయం తీసుకునే అధికారం లేకుండాపోయింది. కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్నా, అజెండా తయారు చేయాలన్నా తనకున్న అధికారాన్ని వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీనిపై ప్రారంభం నుంచి అదే పార్టీకి చెందిన నాయకులు, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వీటిని ఆమె ఏ మాత్రం పట్టించుకోకుండా పార్టీని దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోతూ వస్తున్నారు. పురపాలక సంఘంలో ఛైర్పర్సన్ సుప్రీం అయినప్పటికీ వీధి దీపం వేయించాలన్నా, కాలువ శుభ్రం చేయించాలన్నా, కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్నా, అజెండాను తయారు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా ఎమ్మెల్యే నవాజ్బాషాను సంప్రదించాల్సిందే. ఎమ్మెల్యే పరిశీలించిన తరువాత ఆయన సూచన మేరకు ముందుకెళ్లాల్సిందే. కనీసం వార్డు కౌన్సిలర్ తన వార్డు సమస్యలను పురపాలక సంఘంలో ఫిర్యాదు చేసే పరిస్థితి లేకుండాపోయింది. దీనిపై పలుమార్లు పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఛైర్పర్సన్ మనూజ, ఎమ్మెల్యే నవాజ్బాషాకు మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. ఏడాదిపాటు ఎమ్మెల్యే ఎక్స్అఫిషియో హోదాలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేవారు. ఆ సమయంలో సమావేశానికి వచ్చిన కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను ప్రస్తావించలేకపోవడం గమనార్హం.
మున్సిపల్ ఛైర్పర్సన్ తీవ్ర అసంతృప్తి
పురపాలక సంఘంలో జరుగుతున్న పరిణామాలపై ఛైర్పర్సన్ మనూజ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాను సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండాపోయిందని, తనను నమ్ముకున్న వారికి సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నానని కొంతమంది కౌన్సిలర్ల ఎదుట ఆవేదన వ్యక్తం చేసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. పట్టణంలో మూడు చోట్ల భవన నిర్మాణ పనులకు ఛైర్పర్సన్ సిఫార్సు చేయడాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కమిషనర్ ద్వారా పనులను నిలిపివేయించినట్లు తెలిసింది. గత నెలలో కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి అధికారులు యథావిధిగా అజెండాను తయారు చేసి ఛైర్పర్సన్ దృష్టికి తీసుకురాకుండా ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఛైర్పర్సన్ అజెండాపై సంతకం చేయలేదు. వ్యవహారం ఎంపీ మిథున్రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఫోన్లో ఆమెను సంప్రదించి సంతకం చేయాలని సూచించడంతో చేసేదిలేక ఆమె సంతకం చేశారు. దీనిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే సమావేశం నిర్వహించరాదని ఆదేశించడంతో రద్దయింది. పట్టణంలో ఏ కార్యక్రమం జరిగిన ఛైర్పర్సన్ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లేవారు. తాజాగా బుధవారం ఎంపీ మిథున్రెడ్డి మదనపల్లెకు రాగా, ఛైర్పర్సన్ ప్రత్యేకంగా ఎంపీకి స్వాగతం పలికారు.
సమావేశం రద్దు కావడం వాస్తవమే
బుధవారం జరగాల్సిన కౌన్సిల్ సాధారణ సమావేశం రద్దయిన మాట వాస్తమేనని కమిషనర్ కె.ప్రమీల ‘న్యూస్టుడే’కు తెలిపారు. ప్రతిసారి అజెండాను ఎమ్మెల్యేకు చూపించి ఆయన సంతకాలు తీసుకున్న తరువాతే ఛైర్పర్సన్ వద్దకు తీసుకొచ్చి సంతకాలు తీసుకునేవాళ్లమని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.