దాహమో.... రఘురామ!
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపని ఎమ్మెల్యే
గొంతు తడుపుకొనేందుకు మైదుకూరు పట్టణవాసుల పాట్లు
సర్వాయపల్లెరోడ్డులో ట్యాంకరు వద్ద నీటిని పట్టుకుంటున్న ప్రజలు
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సీఎం జగన్ సొంత ఇలాకాలోని మైదుకూరు పురపాలక సంఘం ప్రజల పరిస్థితి. పట్టణానికి నలువైపులా నదులున్నా శాశ్వత చర్యలు చేపట్టలేని దుస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యం...అధికారుల ఉదాసీనత వైఖరితో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ముందుచూపు లేకపోవడం.. తాత్కాలిక చర్యలతో ఉపశమన చర్యలు చేపట్టడం తాగునీటి కష్టాలకు కారణమైంది. దశాబ్ధాల చరిత్రలో ఫిబ్రవరిలో కుందూనది ఎండిపోయిన దాఖలాల్లేవు. ప్రస్తుతం ఒట్టిపోవడంతో మైదుకూరుకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గత నెలరోజులుగా మంచినీటి ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.
- న్యూస్టుడే, మైదుకూరు
మైదుకూరు పట్టణానికి ఒకవైపున కుందూనది , మరోవైపున పెన్నానది, ఇంకో వైపు తెలుగుగంగ ఉన్నాయి. ఇవన్నీ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చలేకపోతున్నాయి. సుమారు 55 వేలకుపైగా జనాభా ఉన్న పట్టణానికి 8 ఎంఎల్డ్ీల తాగునీటి అవసరం ఉంది. అందుబాటులో ఉన్న బోర్ల ద్వారా ప్రస్తుతం 3.65 ఎంఎల్డీల నీటిని మాత్రమే సరఫరా అవుతుండగా, 4.35 ఎంఎల్డీల కొరత నెలకొంది. శాశ్వత తాగునీటి పరిష్కారం లేదు. కేవలం బోర్ల ద్వారానే నేరుగా సరఫరా చేస్తున్నారు. చెరువుల్లో నీరు లేకపోవడం, నదులు ఒట్టిపోవడంతో తెలుగుగంగ ఉప జలాశయాల్లో అంతంతమాత్రంగానే నీరు ఉండటంతో భూగర్భజల మట్టం రోజురోజుకు గణనీయంగా పడిపోతోంది. ఫలితంగా తాగునీటి బోర్ల నుంచి నీరు తక్కువగా రావడంతో తాగునీటి సమస్యకు దారితీసింది. శాశ్వత తాగునీటి సమస్య పరిష్కార దిశగా తెలుగుగంగ రెండో ఉపజలాశయం ఆధారంగా 2045 నాటికి పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా బృహత్తర తాగునీటి పథకానికి తెదేపా హయాంలోనే రూపకల్పన జరిగింది. రూ.89 కోట్లతో 2018, అక్టోబరు 9న అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పథకం మూలకు చేరింది. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గతేడాది గుత్తేదారులతో చర్చించి పనులు ప్రారంభించేవిధంగా చేశారు. అంతర్గతంగా పైపులైను పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థ మధ్యలోనే పనులు నిలిపేసింది. తెలుగుగంగ రెండో ఉపజలాశయం నుంచి పట్టణానికి ప్రధాన పైపులైను వేయకపోవడం, ఉపరితల భాండాగారాల నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో శాశ్వత తాగునీటి పథకం మైదుకూరుకు కలగానే మిగిలింది. పట్టణంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. డ్రమ్ముకు సరిపడే నీరు మాత్రమే ఇస్తూ ఉండటంతో కొందరు రూ.1000 నుంచి రూ.1200 వెచ్చించి ప్లాస్టిక్ డ్రమ్ములను కొనుగోలు చేస్తున్నారు. మార్చిలో సమస్య జఠిలంగా ఉండగా ఏప్రిల్, మేలలో ఎదురయ్యే సమస్యను తలుచుకుని పట్టణవాసులు భయపడిపోతున్నారు.
ములపాక నుంచి... : పెన్నానది ఆధారంగా ఖాజీపేట మండలంతోపాటు మైదుకూరు పట్టణానికి తాగునీరు సరఫరా చేసేవిధంగా బృహత్తర పథకం ఏర్పాటు చేశారు. నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో తాగునీటి సరఫరా విభాగం అధికారులు ఏడేళ్లుగా సరఫరాను నిలిపివేశారు. వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నా, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా ములపాక నుంచి ఒక ఎంఎల్డీని నీటిని పొందే ప్రయత్నాన్ని అధికారులు చేయలేకపోయారు. దీంతో ట్యాంకర్లతో ఒక్కో ఇంటికి కేవలం 200 లీటర్లను మాత్రమే సరఫరా చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ములపాక నుంచి నీటి సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకోగలిగితే పట్టణ ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.
సరిపెట్టుకుంటున్నాం : ట్యాంకర్లతో ఇస్తున్న నీరు చాలడంలేదు. రోజుకు ఇంటికి ఒక డ్రమ్ము మాత్రమే ఇస్తున్నారు. చేసేదిలేక ఇస్తున్న నీటితోనే సరిపెట్టుకుంటున్నాం. - హుసేన్బీ, సాయినాథపురం
సరిపోవడం లేదు : రోజుకు ఒక డ్రమ్ము నీరు ఇస్తున్నారు. తాగునీటికి సరిపోవడం లేదు. గతేడాది ఈ పరిస్థితి లేదు. కొత్త బోర్లు వేసి కుళాయిలకు నీరు ఇవ్వాలి.
- మున్నీ, సర్వాయపల్లె రోడ్డు
డ్రమ్ము నీళ్లు సరిపోవు : రోజుకు ఒక డ్రమ్ము నీళ్లు ఇస్తే సరిపోవు. ఇంట్లో నలుగురైదుగురు ఉంటే ఏమాత్రం సరిపోవు. తాగునీటికి దూరప్రాంతాలకు వెళ్లలేక ఇస్తున్న నీటితోనే సర్దుకుంటున్నాం.
- గౌసియా, సర్వాయపల్లె రోడ్డు
వారం రోజుల్లో ములపాక నుంచి నీరు : మైదుకూరు పట్టణానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేలా తెలుగుగంగ నుంచి ఎర్రచెరువుకు నీరు విడుదల చేశారు. వారం రోజుల్లో ములపాక నుంచి నీరు వచ్చేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నాం.
- రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నుంచి తెదేపాలోకి పలు కుటుంబాలు చేరిక
[ 27-04-2024]
మండల కేంద్రంలో శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో తెదేపా నాయకులు తిమ్మిశెట్టి రమణయ్య, అక్కిశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో పలు కుటుంబాలు తెదేపాలో చేరాయి. -
10 మందిపై బైండోవర్ కేసులు
[ 27-04-2024]
మండలంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం పలు గ్రామాలకు చెందిన పది మందిపై బైండోవర్ కేసు నమోదు చేశామని ఎస్సై నాగమురళి తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి
[ 27-04-2024]
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రధానోపాధ్యాయుడు, జేవీవీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.ఖాసింవల్లి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్ తెలిపారు. -
విద్యార్థినికి సన్మానం
[ 27-04-2024]
మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పత్తి కిరణ్ కుమార్ కుమార్తె పత్తి సాయిశ్రీనిజ పదోతరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 27-04-2024]
తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ తెలిపారు. -
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట