logo

విద్యార్థినికి సన్మానం

మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పత్తి కిరణ్ కుమార్ కుమార్తె పత్తి సాయిశ్రీనిజ పదోతరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించింది.

Published : 27 Apr 2024 19:15 IST

కలసపాడు: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పత్తి కిరణ్ కుమార్ కుమార్తె పత్తి సాయిశ్రీనిజ పదోతరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించింది. శనివారం ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణా రెడ్డి, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.వి. సత్యనారాయణ, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం.శేఖర్ బాబు విద్యార్థి సాయి శ్రీని ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు ఎన్.శివారెడ్డి, కె.వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని